YS Vijayamma: బిడ్డ‌ల మ‌ధ్య పోరు.. అమెరికాకు విజ‌య‌మ్మ‌

YS Vijayamma: ఇద్ద‌రు బిడ్డ‌ల మ‌ధ్య పోరును ప‌డ‌లేకపోతోంది దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి స‌తీమ‌ణి వైఎస్ విజ‌య‌మ్మ‌. ఆమె ఇద్ద‌రు పిల్ల‌లు చెరో దారి చూసుకుని రాజ‌కీయ బ‌రిలో దిగారు. జ‌గన్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) క‌డ‌ప ఎంపీ సీటును వైఎస్ అవినాష్ రెడ్డికి (YS Avinash Reddy) ఇవ్వ‌డంతో.. కాంగ్రెస్ నుంచి ఇదే సీటుపై ఎంపీగా వైఎస్ ష‌ర్మిళ (YS Sharmila) పోటీకి దిగారు.

ఈ నేప‌థ్యంలో త‌నకు మ‌ద్దుత‌గా నిలిచి ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయాలని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విజ‌య‌మ్మ‌ను కోరారు. అలా చేస్తే ష‌ర్మిళకు నష్టం వాటిల్లుతుంద‌ని ఆమె ఎంత చెప్పినా జ‌గ‌న్ విన‌డంలేదు. దాంతో ఏం చేయాలో తెలీక మీ పాట్లు మీరు ప‌డండి అంటూ విజ‌య‌మ్మ అమెరికాకు వెళ్లిపోయిన‌ట్లు నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌లు అయిపోయాకే విజ‌యమ్మ భార‌త‌దేశానికి వ‌స్తార‌ని స‌మాచారం. విజ‌య‌మ్మ‌కు మాత్రం కూతురి వైపే నిల‌బ‌డాల‌ని ఆమెతోనే ప్ర‌చారంలో పాల్గొనాల‌ని ఉంది. కానీ జ‌గ‌న్ అందుకు ఒప్పుకోవ‌డంలేదు. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య ఉంటే త‌న‌కు లేనిపోని త‌ల‌నొప్పి ఎందుక‌ని ఆమె అమెరికా వెళ్లిపోయారు.