ష‌ర్మిళ‌పైకి దూసుకొచ్చిన వైసీపీ కార్య‌క‌ర్త‌లు.. రండి చూస్కుందాం అన్న సునీత‌

YS Sharmila: పులివెందుల‌లో ఉద్రిక్త‌త నెల‌కొంది. ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌సంగిస్తుండ‌గా.. ఆమెను వైఎస్సార్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు. జై జ‌గ‌న్ అంటూ ఆమె కార్య‌క‌ర్త‌ల‌పై దాడి చేసేందుకు య‌త్నించారు. దాంతో ష‌ర్మిళ‌తో పాటు ఉన్న వైఎస్ సునీతా రెడ్డి (YS Sunitha Reddy) వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. పులివెందుల పూలంగ‌ళ్ల స‌ర్కిల్‌కు రండి తేల్చుకుందాం అని స‌వాల్ విసిరారు. దాంతో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.