JR NTR: మీకెలా తెలుసు నేనొచ్చాన‌ని.. షాకైన తార‌క్!

JR NTR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. అక్క‌డ షారుక్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్‌ల‌కు ఎంత ప్రాముఖ్య‌త ఉందో ఇంచు మించు తార‌క్‌కు కూడా అంతే పాపులారిటీ ఉంది. అయితే.. ఈరోజు తార‌క్ ముంబైలో అడుగుపెట్టారు. ఆయ‌న వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో షూటింగ్ మొద‌లు కాబోతోంది. ఈ నేప‌థ్యంలో తార‌క్ ముంబై విమానాశ్ర‌యంలోని ప్రైవేట్ టర్మినల్ ద్వారా ఎగ్జిట్ అవ్వాల‌ని అనుకున్నారు.

సాధార‌ణంగా అక్క‌డ ల్యాండ్ అయిన‌ప్పుడు స్థానిక మీడియా వ‌ర్గాల‌కు స‌మాచారం ఉండదు. కానీ తార‌క్ వ‌చ్చాడ‌ని తెలీగానే వారంతా కెమెరాల‌తో ప‌రుగులు తీసార‌. దాంతో ఎన్టీఆర్ వారికి చూసి షాక‌య్యారు. అరె.. నేనొచ్చాన‌ని వీరికి ఎలా తెలిసింది? అని హిందీలో కామెంట్ చేసారు. తార‌క్ షాక‌వ్వ‌డాన్ని చూసి స్థానిక ఫోటోగ్రాఫ‌ర్లు కూడా న‌వ్వుకున్నారు. దాంతో ఇక చేసేదేమీ లేక వారికి కొన్ని ఫోటోల‌కు పోజులిచ్చి వెళ్లిపోయారు.

ఇక వార్ 2 సినిమా విష‌యానికొస్తే.. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో హృతిక్ రోష‌న్ కూడా న‌టిస్తున్నారు. అయితే.. వార్ 2లో ఎన్టీఆర్ డ‌బుల్ రోల్‌లో న‌టించ‌బోతున్నార‌ని.. సినిమాలో ఆయ‌న పాత్రే కీల‌కం అనే టాక్ న‌డుస్తోంది. 2025 ఆగ‌స్ట్‌లో సినిమా రిలీజ్ కాబోతోంది.