తమిళనాడు BJP అధ్యక్షుడి కోసం నారా లోకేష్ ప్రచారం

BJP: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ త‌మిళ‌నాడులో భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అన్నామ‌లై (Annamalai) కోసం ప్ర‌చారం చేయ‌నున్నారు. అన్నామ‌లై కోయింబ‌త్తూరు నుంచి ఎంపీగా పోటీ చేయ‌నున్నారు. అక్క‌డ తెలుగు వారు ఎక్కువ‌గా స్థిర‌ప‌డ్డారు కాబట్టి వారి కోసం నారా లోకేష్‌ను ప్ర‌చారంలోకి దించ‌నున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో భాగంగా తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీలు భార‌తీయ జ‌న‌తా పార్టీతో క‌లిసి కూట‌మిని ఏర్పాటుచేసిన సంగ‌తి తెలిసిందే. దాంతో ద‌క్షిణాదిలో త‌క్కువ పాపులారిటీ ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇలా లోక్ స‌భ ఎన్నిక‌ల కోసం కూట‌మి నేత‌ల‌ను వాడుకుంటోంది.