KTR: కంగ‌నా ర‌నౌత్‌పై కేటీఆర్ సెటైర్

KTR: భార‌త రాష్ట్ర స‌మితి (BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. బాలీవుడ్ న‌టి కంగనా ర‌నౌత్‌పై  (Kangana Ranaut) సెటైర్ వేసారు. కంగ‌న‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ మండి నుంచి లోక్ స‌భ ఎంపీగా టికెట్ ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో కంగ‌న ఓ సంద‌ర్భంలో నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్‌ని బెస్ట్ భార‌త‌దేశ తొలి ప్ర‌ధాని అని అన్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. “” ఉత్త‌రాదికి చెందిన ఒక‌ బీజేపీ నేత ఏమో నేతాజీ భార‌త ప్ర‌ధాని అంటారు.. ద‌క్షిణాదికి చెందిన మ‌రో బీజేపీ నేత మ‌హాత్మా గాంధీ మ‌న ప్ర‌ధాని అంటారు. అస‌లు వీరంతా ఏం చ‌దువుకున్నారో ఏమో “” అని ట్వీట్ చేసారు.

కంగ‌న భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి భ‌క్తురాలిగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. భార‌త‌దేశానికి స్వ‌తంత్రం భారత్‌కు మోదీ ప్ర‌ధాని అయ్యాకే వ‌చ్చింద‌ని ఆమె వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌నం సృష్టించింది.