Yaduveer Wadiyar: మైసూరు మ‌హారాజుకు సొంత ఇల్లు ఎందుకు లేదు? ఆయ‌న ఆస్తి ఎంత‌?

Yaduveer Wadiyar: మైసూరు మ‌హారాజు య‌దువీర్ కృష్ణ‌ద‌త్త చామ‌రాజ వ‌డియ‌ర్‌కు సొంత ఇల్లు, కారు లేక‌పోవ‌డం అనేది ఇప్పుడు క‌ర్ణాట‌క వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఆయ‌న మైసూరులోని కొడ‌గు ప్రాంతం నుంచి పోటీ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా య‌దువీర్ అఫిడ‌విట్లు ఫైల్ చేయ‌గా.. అందులో త‌న‌కు సొంత కారు, ఇల్లు, భూమి లేవ‌ని పేర్కొన్నారు. ఆయ‌న వేసిన నామినేష‌న్ ప‌త్రాల్లో త‌న దగ్గ‌రున్న ఆస్తి కేవ‌లం రూ.5 కోట్లే అని పేర్కొన్నారు. ఆయ‌న భార్య త్రిషిక కుమారి వ‌డియ‌ర్ వ‌ద్ద మాత్రం 1.04 నుంచి రూ.3.64 కోట్ల వ‌ర‌కు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.

య‌దువీర్ వ‌ద్ద రూ.3.39 కోట్లు విలువైన బంగారు, వెండి ఆభ‌ర‌ణాలు ఉన్నాయి. రూ.1.02 కోట్ల విలువైన ఆభ‌ర‌ణాలు ఆయ‌న భార్య త్రిషిక వ‌ద్ద ఉన్నాయి. య‌దువీర్ కాంగ్రెస్ నేత ఎం. ల‌క్ష్మ‌ణపై పోటీ చేయ‌నున్నార‌ను. ల‌క్ష్మ‌ణ క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ప్ర‌జాప్ర‌తినిధిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.