Viral News: బ‌ర్త్‌డే రోజు కేక్ తిని బాలిక మృతి

Viral News: పుట్టిన‌రోజు నాడే దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కేక్ క‌ట్ చేసి తినగా.. దాని వ‌ల్ల క‌లిగిన అనారోగ్యం వ‌ల్ల అదే రోజున చ‌నిపోయింది. ఈ విషాద ఘ‌ట‌న పంజాబ్‌లో చోటుచేసుకుంది. ప‌టియాలాకు చెందిన మాన్వి అనే బాలిక నిన్న త‌న పదో పుట్టిన‌రోజును వేడుక‌గా జ‌రుపుకోవాల‌ని అనుకుంది. ఇందుకోసం మాన్వి తల్లిదండ్రులు ఆన్‌లైన్ నుంచి కేక్ ఆర్డ‌ర్ చేసారు.

కేక్ క‌ట్ చేసి అంద‌రూ తిన్నాక అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. మాన్వి ప‌రిస్థితి మ‌రీ విష‌మంగా ఉండ‌టంతో ఆమెను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు వైద్యులు పేర్కొన్నారు. పుట్టిన‌రోజు నాడే త‌మ బిడ్డ చ‌నిపోవ‌డంతో ఆ త‌ల్లిదండ్రుల రోద‌న‌లు మిన్నంటాయి. మాన్వి సోద‌రికి వాంతులు కావ‌డంతో కేక్ అంతా బ‌య‌టికి వ‌చ్చేసింద‌ని.. లేదంటే ఆమె ప్రాణాలకూ ప్ర‌మాదం వాటిల్లేద‌ని పేర్కొన్నారు. కేక్ డెలివ‌రీ చేసిన వ్య‌క్తి పొంత‌న లేని స‌మాధానాలు చెప్తుండ‌డంతో అత‌న్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.