KTR: మ‌ళ్లీ వ‌చ్చి KCR కాళ్లు ప‌ట్టుకున్నా రానివ్వం

KTR: భార‌త రాష్ట్ర స‌మితి (BRS) క‌ష్ట‌కాలంలో ఉంటే పార్టీ నేత‌లు మ‌ద్ద‌తు ఇవ్వాల్సిందిపోయి వ‌దిలి వెళ్లిపోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ త‌ర్వాత మ‌ళ్లీ వెళ్లిపోయిన నేత‌లు వ‌చ్చి KCR కాళ్లు ప‌ట్టుకున్నా కూడా పార్టీలో చేర్చుకోనివ్వం అని తేల్చి చెప్పేసారు. “” శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కెసిఆర్‌. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం KCR. అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు. ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCR గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం అని ట్వీట్ చేసారు “” కేటీఆర్.

BRS నుంచి చెత్త అంతా పోతుంది

BRS నుంచి చెత్త అంతా పోతుంది.. గట్టి వాళ్లే మిగులుతున్నారని అన్నారు BRS ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. నాయకులను కొంటారు కానీ కార్యకర్తలను కొనలేరని ఆయ‌న వ్యాఖ్యానించారు. నేత‌ల‌ను ఇత‌ర పార్టీలు కొంటారు కానీ కార్య‌క‌ర్త‌ల‌ను కొన‌లేర‌ని తెలిపారు.