పొలిటిక‌ల్ ఎంట్రీ.. దిల్‌రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు త‌న రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఆయ‌న నిర్మాతగా వ్య‌వ‌హరించిన బ‌ల‌గం సినిమా స‌క్సెస్ సంద‌ర్భంగా ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. అయితే.. ఎప్ప‌టినుంచో ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు అని వ‌స్తున్న రూమ‌ర్స్‌పై స్పందించారు. ఎన్నో పార్టీలు త‌న‌ని ఆహ్వానించాయ‌ని, కానీ సినీ రంగంలో నిర్మాత‌గా ఉంటేనే రాళ్లు విసురుతున్న‌ప్పుడు.. ఇక రాజ‌కీయాల్లోకి వ‌స్తే ఇంకెన్ని రాళ్లు విసురుతారోన‌ని అన్నారు. మ‌రోపక్క బ‌ల‌గం సినిమాను బ‌య‌ట ప్ర‌దేశాల్లో ప్ర‌ద‌ర్శించొద్దు అని దిల్‌రాజు నోటీసులు జారీ చేసిన‌ట్లు కూడా వ‌దంతులు వ‌చ్చాయి. దీనిపై ఆయ‌న స్పందిస్తూ.. నాకు పేరు వస్తే నన్ను బ్యాడ్ చెయ్యడానికి ఎప్పుడూ ఒక బ్యాచ్ రెడీగా ఉంటుంది అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. మ‌రోప‌క్క ఆయ‌న నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన శాకుంత‌లం ఈ నెల 14న రిలీజ్ కాబోతోంది. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాకు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.