Swami Paripoornananda: బాల‌య్య ఏం చేసాడ‌ని.. హిందూపురం నాదే

పొత్తే ప్ర‌మాదం

తెలుగు దేశం పార్టీ జ‌నసేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీల‌తో పొత్తు పెట్టుకోవ‌డంపై స్పందిస్తూ.. పొత్తే ప్ర‌మాద‌క‌రం అని అన్నారు. తెలుగు దేశం పార్టీ వారే ఆల్మోస్ట్ భార‌తీయ జ‌న‌తా పార్టీలో ఉన్నారని.. దీని వ‌ల్ల భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌న ఉనికిని కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని తెలిపారు.

ప‌వ‌న్ హోంవ‌ర్క్ చేయాల్సిందే

గ‌తంలో గాజువాక‌, భీమ‌వ‌రం నుంచి ఓడిపోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. గ‌తంలో సీనియ‌ర్ ఎన్టీఆర్, ఇందిరా గాంధీలు కూడా ఓడిపోయార‌ని ఓట‌మి పెద్ద విష‌యం కాదు కానీ.. మ‌ళ్లీ పోటీ చేసేట‌ప్పుడు గ్రౌండ్ వ‌ర్క్, హోంవ‌ర్క్ క‌చ్చితంగా చేయాల్సిందేన‌ని ప‌వ‌న్‌కు సూచించారు. హోంవ‌ర్క్ చేయ‌కుండా త‌న బాధ్య‌త‌ను మ‌రో ప‌ది మంది జ‌న‌సైనికుల‌పై వేసేస్తే మాత్రం పిఠాపురంలో ఆయ‌న గెల‌వ‌డం క‌ష్టం అని తెలిపారు.

ALSO READ: హ్యాట్రిక్ కోసం బాల‌య్య కీల‌క నిర్ణ‌యం