నోట్ల క‌ట్ట‌ల‌పై ప‌డుకుని రాజ‌కీయ నాయ‌కుడి పోజులు!

Viral News: ఓ రాజ‌కీయ నాయ‌కుడు నోట్ల క‌ట్ట‌ల‌పై ప‌డుకుని ఫోటోలు తీయించుకున్న ఘ‌ట‌న అస్సాంలో చోటుచేసుకుంది. యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబ‌ర‌ల్స్ (UPPL) అనే పార్టీకి చెందిన బెంజ‌మిన్ అనే నాయ‌కుడు విలేజ్ కౌన్సిల్ డెవ‌ల‌ప్‌మెంట్ క‌మిటీ స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇత‌ను త‌న ఇంట్లోని మంచంపై నోట్ల క‌ట్టలు వేసుకుని లుంగీ క‌ట్టుకుని వాటిపై ప‌డుకుని ఒంటిపై నోట్లు చల్లించుకుంటూ ఫోటోల‌కు పోజులిచ్చాడు. ఇవి కాస్తా బ‌య‌టికి రావ‌డంతో వైర‌ల్‌గా మారింది. దాంతో పార్టీ వెంట‌నే ఇత‌న్ని స‌స్పెండ్ చేసింది.

దీనిపై బెంజ‌మిన్ స్పందిస్తూ.. ఆ ఫోటోలో ఉన్న‌ది తానేన‌ని కాక‌పోతే అది చాలా పాత ఫోటో అని ఇప్పుడు రాజ‌కీయ లబ్ధి కోసం కావాల‌నే ప్ర‌తిప‌క్ష పార్టీలు వైర‌ల్ చేస్తున్నాయ‌ని అన్నారు.