Karnataka: బెట్టింగ్‌లో డ‌బ్బు పోగొట్టుకున్న భ‌ర్త‌.. భార్య ఆత్మ‌హ‌త్య‌

Karnataka: IPL బెట్టింగ్‌లో డ‌బ్బులు పెట్టి ఓ వ్య‌క్తి దాదాపు కోటి రూపాయ‌ల వ‌ర‌కు డ‌బ్బులు పోగొట్టుకున్నాడు. దాంతో అత‌ని భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో చోటుచేసుకుంది. చిత్ర‌దుర్గ ప్రాంతానికి చెందిన ద‌ర్శ‌న్ బాబు అనే ఇంజినీర్‌కి 2021లో రంజిత‌తో వివాహం జరిగింది. ఇత‌నికి బెట్టింగ్ అంటే ఇష్టం. ఐపీఎల్ సీజ‌న్ స‌మ‌యంలో డ‌బ్బులు పెట్టి గెలుచుకున్న రోజులు కూడా ఉన్నాయి. దాంతో ఈసారి కూడా బెట్టింగ్‌లో చాలా డ‌బ్బు పెట్టాడు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు కోటి రూపాయ‌ల వ‌ర‌కు పోగొట్టుకున్నాడు.

దాంతో అప్పుల వాళ్లు రోజూ ఇంటికి వ‌చ్చి టార్చ‌ర్ పెడుతుండ‌డంతో రంజిత ఈరోజు మ‌ధ్యాహ్నం ఉరేసుకుంది. ఈ నేపథ్యంలో రంజిత తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేసాడు. రంజిత‌ను టార్చ‌ర్ పెట్టిన 14 మంది పేర్ల‌ను పోలీసుల‌కు వెల్ల‌డించ‌డంతో వారు విచార‌ణ చేప‌డుతున్నారు. బెట్టింగ్ వ‌ద్దు అని ద‌ర్శ‌న్ ఎంత చెప్తున్నా కూడా కొంద‌రు వ్య‌క్తులు త్వ‌ర‌గా డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చు అని ఊరించిన‌ట్లు రంజిత తండ్రి వెల్ల‌డించారు. ద‌ర్శ‌న్, రంజిత‌ల‌కు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.