Lok Sabha Elections: స్టార్స్‌కు ద‌క్క‌ని ఛాన్స్…!

Lok Sabha Elections: లోక్ స‌భ ఎన్నిక‌ల్లో సినిమా వాళ్ల‌కు అవ‌కాశం ల‌భించ‌లేదు. విజ‌య‌శాంతి మ‌ల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తారని ప్ర‌చారం జ‌రిగింది. అయినా టికెట్ ల‌భించ‌లేదు. అక్క‌డి నుంచి సునీతా మ‌హేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వ‌డంతో జ‌య‌సుధ నిరాశ‌ప‌డ్డారు. అదే టికెట్‌ను నిర్మాత బండ్ల గ‌ణేష్ కూడా ఆశించారు. ఆయ‌న‌కు కూడా చుక్కెదురైంది. కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ టికెట్‌ను నిర్మాత దిల్ రాజు ఆశించారు. ఆయ‌న‌కు కూడా ద‌క్క‌లేదు. న‌టుడు అల్లు అర్జున్ మామ‌గారు కంచ‌ర్ల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి కూడా భంగ‌పాటు త‌ప్ప‌లేదు.

చేవెళ్ల కానీ మ‌ల్కాజ్‌గిరి టికెట్‌ను ఆశించి కాంగ్రెస్‌లో చేరినా ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌లేదు. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేర‌డంతో చేవెళ్ల టికెట్‌ను ఆయ‌న‌కే ఇచ్చింది కాంగ్రెస్ హై క‌మాండ్. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్లు రాక ఇప్పుడూ రాక వారు ఎంతో నిరుత్సాహ‌ప‌డుతున్నారు. ఇక అసెంబ్లీ టికెట్ల కోసం హీరో నితిన్, జ‌య‌సుధ‌, జీవిత రాజ‌శేఖ‌ర్, రాహుల్ సిప్లిగంజ్ ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త రాష్ట్ర స‌మితి 17, కాంగ్రెస్ 9 స్థానాల‌ను భారతీయ జ‌న‌తా పార్టీ పూర్తిగా అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించేసారు. వీరిలో ఏ ఒక్క‌రు కూడా సినిమా వాళ్లు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.