AP Elections: ప్ర‌భుత్వ అధికారుల‌పై ఈసీ సీరియ‌స్

AP Elections: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌భుత్వ అధికారుల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అధికార పక్షం అక్ర‌మాల‌పై కుప్ప‌లు తెప్ప‌లుగా ఫిర్యాదులు వ‌స్తున్నాయని ఈసీకి మండిప‌డింది. దీని గురించి క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌ను ఎన్నిక‌ల సంఘం అధికారులు ఆరా తీయగా.. అదేమీ లేద‌ని అంతా బాగానే ఉంద‌ని చెప్తున్నార‌ట‌. వారు ఇస్తున్న స‌మాచారంలో పొంత‌నే లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ అధికారుల పుట్టుపూర్వోత్త‌రాల‌పై ఎన్నిక‌ల సంఘం ఆరా తీస్తోంది. కొంద‌రు అధికారుల‌పై మాత్రం అంత‌ర్గ‌త విచార‌ణ చేప‌డుతున్నారు. వారం రోజుల త‌ర్వాత వ‌రుస‌గా అధికారుల‌పై వేటు ప‌డే అవ‌కాశం ఉంది.