Virender Sehwag: ధోనీని మాత్ర‌మే చూపించిన కెమెరామ్యాన్.. సెహ్వాగ్ ఆగ్ర‌హం

Virender Sehwag: ప్ర‌ముఖ మాజీ క్రికెట‌ర్ వీరేందర్ సెహ్వాగ్.. చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings) మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీని (MS Dhoni) మాత్ర‌మే చూపించ‌డాని కెమెరా మ్యాన్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. మొన్న చెపాక్ స్ట‌డియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కి.. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు (CSK vs RCB) జ‌రిగిన మ్యాచ్ స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

ఈసారి చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత రుతురాజ్ గైక్వాడ్‌ను (Ruturaj Gaikwad) కెప్టెన్‌గా ప్ర‌క‌టించారు. అయితే మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో కెమెరామ్యాన్ ధోనీ వైపు ఒక 30 క్ష‌ణాల పాటు కెమెరాను ఫోక‌స్ చేసాడు. దాంతో కమెంటేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సెహ్వాగ్.. అన్నా.. ఎంత‌సేపు ధోనీనే చూపిస్తావు. ఇక్క‌డ కెప్టెన్ రుతురాజ్. అత‌న్ని కూడా చూపించు అన్నాడు.