Ujjain మ‌హాకాళేశ్వ‌రాల‌యంలో అప‌శ్రుతి

Ujjain: మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉజ్జ‌యినిలోని మ‌హాకాళేశ్వ‌రాయంలో అప‌శ్రుతి చోటుచేసుకుంది. సోమ‌వారం సంద‌ర్భంగా శివయ్య‌కు భ‌స్మ హార‌తి ఇస్తుండ‌గా మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న‌లో దాదాపు 13 మంది పూజారులు గాయ‌పడ్డారు. దాంతో ఆల‌యంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. గాయ‌ప‌డిన పూజారుల‌ను జిల్లా హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. హోళీ సంద‌ర్భంగా గ‌ర్భ‌గుడిలో భ‌స్మ హార‌తి ఇస్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ తెలిపారు.