AP Elections: పొన్న‌వోలు సుధాక‌ర్‌పై ఈసీ సీరియ‌స్

AP Elections: ఏఐజి పొన్న‌వోలు సుధాక‌ర్ (Ponnavolu Sudhakar Reddy) రెడ్డిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ECI) సీరియ‌స్ అయ్యింది. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి అమ‌ల్లో ఉన్న నేప‌థ్యంలో పొన్న‌వోలు నిన్న జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో నేత‌ల‌తో క‌లిసి పాల్గొన్నారు. దాంతో ఎన్నిక‌ల కోడ్‌ను ఉల్లంఘించారంటూ తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) లీగ‌ల్ సెల్ ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. దాంతో ఎన్నిక‌ల సంఘం పొన్న‌వోలుపై మండిపడింది. రాజ‌కీయ కార్య‌క్ర‌మాల్లో మీకేం ప‌ని అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్ అయిన‌ప్పుడు YSRCP త‌ర‌ఫున కేసును వాదించింది పొన్న‌వోలే. దాంతో ఆయ‌న‌కు పార్టీ నుంచి భారీగా తాయిలాలు అందిన‌ట్లు స‌మాచారం.