Mudragada: కృష్ణంరాజుపై ముద్ర‌గ‌డ షాకింగ్ వ్యాఖ్య‌లు

Mudragada: కాపు సంఘం అధినేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం.. దివంగ‌త న‌టుడు కృష్ణంరాజుపై అనుచిత వ్యాఖ్య‌లు చేసారు. సినిమా వాళ్ళు రాజకీయాలకు పనికి రారు అంటూ జ‌నసేన అధినేత‌ పవన్ కళ్యాణ్‌ని (Pawan Kalyan) టార్గెట్ చేస్తూ… కృష్ణంరాజు గెలిపించడం కోసం పడ్డ కష్టమంతా వేస్ట్… సమస్యలకు సమాధానం చెప్పలేకపోయే వాడిని అని అన్నారు.

ఇటీవ‌ల YSRCPలో చేరిన ముద్ర‌గ‌డ మాటిమాటికీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఉద్దేశించి ఏది ప‌డితే అది మాట్లాడుతున్నారు. పిఠాపురంలో ప‌వ‌న్ కళ్యాణ్ గెల‌వ‌డం అసాధ్య‌మ‌ని అన్నారు. తెలుగు దేశం పార్టీని స్థాపించిన దివంగ‌త న‌టుడు నంద‌మూరి తార‌క రామారావు త‌ర్వాత అంత‌టి స్థాయిలో రాజ‌కీయాల్లో రాణించిన‌వారు లేర‌ని.. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రిస్థితి కూడా అదేన‌ని అన్నారు.