KCR: దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజు

KCR: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్టును తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి KCR ఖండిచారు. ఇది దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజని అన్నారు. ప్ర‌తిప‌క్షాన్ని నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే ఏకైక సంక‌ల్పంతో కేంద్రంలోని అధికార భార‌తీయ జ‌న‌తా పార్టీ (BJP) వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఇటీవ‌ల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్, భార‌త రాష్ట్ర స‌మితి (BRS) ఎమ్మెల్సీ కవిత (Kalvakuntla Kavitha) అరెస్టు ఘ‌ట‌న‌లు రుజువు చేస్తున్నాయని అన్నారు. ఇందుకోసం ED, CBI, IT త‌దిత‌ర కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం పావులుగా వాడుకుంటోంద‌ని ఆరోపించారు.

ప్ర‌జాస్వామ్యానికి గొడ్డ‌లిపెట్టుగా ప‌రిణ‌మిస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను భారత రాష్ట్ర స‌మితి తీవ్రంగా ఖండిస్తోంద‌ని… కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ అని వ్యాఖ్యానించారు. అక్ర‌మ కేసుల‌ను వెంట‌నే వెన‌క్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని వెంట‌నే విడుదల చేయాల‌ని డిమాండ్ చేసారు.