Rajamouli: జ‌పాన్‌లో భూకంపం.. 28వ అంత‌స్తులో రాజ‌మౌళి!

Rajamouli: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి ప్ర‌స్తుతం జ‌పాన్‌లో ఉన్నారు. ఆయ‌న తీసిన RRR సినిమాను జ‌పాన్‌లో ప్ర‌ద‌ర్శిస్తున్న నేప‌థ్యంలో కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ‌తో పాటు నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ‌తో క‌లిసి జక్క‌న్న జపాన్ వెళ్లారు. అయితే ఈరోజు అక్క‌డ భారీ భూకంపం సంభ‌వించింద‌ట‌. ఈ విష‌యాన్ని కార్తికేయ ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డిస్తూ త‌మ ప‌రిస్థితిని వివ‌రించారు. ఇప్పుడే భారీ భూకంపం వ‌చ్చింది. నేను నాన్న 28వ అంత‌స్తులో ఉన్నాం. ఒక్క‌సారిగా అన్నీ ఊగిపోతున్న‌ట్లు అనిపించింది. కానీ మేం ఉన్న హోట‌ల్‌లోని మిగ‌తావారు మాత్రం అస‌లేమీ కాన‌ట్లు ఉన్నారు అని తెలిపారు. ఈ ట్వీట్ చూసిన‌వారంతా రాజమౌళి, కార్తికేయ‌, శోభు యార్ల‌గ‌డ్డ క్షేమంగా ఇండియాకు తిరిగి రావాలంటూ కామెంట్స్ పెడుతున్నారు.