Operation Pithapuram: ప‌వ‌న్ కోసం ఆరుగురిని దించిన జ‌గ‌న్

Operation Pithapuram: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  (Jagan Mohan Reddy) త‌న జాగ్ర‌త్త‌లో తాను ఉంటున్నారు. ఇత‌ర సీట్ల‌ను ప‌క్క‌న పెట్టి కేవ‌లం పిఠాపురంపైనే ఎక్కువ ఫోక‌స్ చేస్తున్నారు. ఆప‌రేష‌న్ పిఠాపురం పేరుతో ఓ ప్లాన్ కూడా సిద్ధం చేసారు. ఆ ప్లాన్ ఏంటంటే.. దాదాపు ఆరుగురు కాపు వ‌ర్గానికి చెందిన నేత‌ల చేత పిఠాపురంలో ప్ర‌చారం చేయించ‌నున్నారు.

రంగంలోకి వైసీపీ నేత‌లు

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం

ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి

దాడిశెట్టి రాజా

వంగా గీత‌

కుర‌సాల క‌న్న‌బాబు

మిథున్ రెడ్డి

పిఠాపురం సీటు నుంచి వైసీపీ త‌ర‌ఫున వంగ గీత (Vanga Geetha) బ‌రిలోకి దిగ‌నున్నారు. దాంతో గీతను ఎలాగైనా గెలిపించాల‌న్న ఉద్దేశంతో వైపీపీ ఓటుకు రూ.ల‌క్ష వ‌ర‌కు వెచ్చించేందుకు కూడా వెనకాడ‌దు అని ప‌వ‌న్ ఆరోపిస్తున్నారు.

ఇలా వైసీపీ నాయకులు అందరికీ వార్డులు వారిగా మండలాల వారిగా పిఠాపురంలో ఒక్కోరికి ఒక్కో బాధ్యత అప్పజెప్పారు సీఎం జ‌గ‌న్. ఇక పిఠాపురం నుంచి పార్టీలో చేరేవారికి స్వయంగా సీఎం సమక్షంలో కండువాలు కప్పుతున్నారు. మరి కొన్ని రోజుల్లో మంత్రులందరూ పలు దఫాలుగా పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు ఇక అతి త్వరలో సీఎం బస్సు యాత్ర కూడా ఉండబోతోంది.