Sadhguru కి ఎమ‌ర్జెన్సీ బ్రెయిన్ స‌ర్జ‌రీ

Sadhguru: ప్ర‌ముఖ ఆధ్యాత్మికవేత్త‌, ఇషా ఫౌండేష‌న్ అధినేత స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ్‌కు అత్య‌వ‌స‌ర బ్రెయిన్ స‌ర్జ‌రీ జ‌రిగింది. ఢిల్లీలోని అపోలో హాస్పిట‌ల్‌లో ఈ బ్రెయిన్ స‌ర్జ‌రీ జ‌రిగింది. మెద‌డులో ఇంట‌ర్న‌ల్ బ్లీడింగ్ కావ‌డంతో హుటాహుటిన హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అక్క‌డ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన వైద్యులు స‌ద్గురు మెద‌డు భాగం ఉబ్బింద‌ని వెంట‌నే స‌ర్జ‌రీ చేయ‌క‌పోతే ప్రాణానికే ప్ర‌మాదం అని తెలిపారు. స‌ర్జ‌రీ చేస్తున్న స‌మ‌యంలో స‌ద్గురు వెంటిలేట‌ర్‌పై ఉన్నార‌ని ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని ఇషా ఫౌండేష‌న్ సిబ్బంది తెలిపారు.