AP Elections: పోటీపై మ‌న‌సు మార్చుకున్న ప‌వ‌న్?

AP Elections: జ‌నసేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) ఆంధ్ర‌ప్ర‌దేశ్, లోక్ స‌భ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై మ‌న‌సు మార్చుకున్నట్లు అనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న‌ట్లు ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. కాకినాడ ఎంపీ స్థానం నుంచి కూడా పోటీ చేస్తార‌ని టాక్ న‌డిచింది. కానీ ఎంపీ స్థానాన్ని ప‌వ‌న్ ఉద‌య్ శ్రీనివాస్‌కు ఇచ్చారు. ఇక్క‌డి వ‌ర‌కు అంతా క్లారిటీగానే ఉంది. కానీ ప‌వ‌న్ నిన్న ఒకమాట‌న్నారు. ఒక‌వేళ భార‌తీయ జ‌న‌తా పార్టీ హైక‌మాండ్ త‌న‌ను కాకినాడ ఎంపీగా పోటీ చేయ‌మంటే మాత్రం పిఠాపురం స్థానాన్ని ఉద‌య్ శ్రీనివాస్‌కు ఇస్తాన‌ని అన్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ త‌న మ‌న‌సు కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయాల‌ని చెప్తోంద‌ని తెలిపారు. దాంతో కాకినాడ ఎంపీ సీటుపై కాస్త గంద‌ర‌గోళం నెల‌కొంది.

ప‌వ‌న్ నిర్ణ‌యంతో అటు YSRCP కూడా అయోమ‌యంలో ప‌డింది. ఎందుకంటే ప‌వ‌న్‌ను ఎలాగైనా ఓడించాల‌ని వైసీపీ పిఠాపురం అభ్య‌ర్ధిగా వంగా గీత‌ను (Vanga Geetha) దించింది. అంతేకాదు ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం వంటి కాపు నేత‌ల‌ను బరిలోకి దింపి కాపుల ఓట్లు త‌మ‌కు ప‌డేలా ఆప‌రేష‌న్ పిఠాపురం అనే ప్లాన్ చేప‌ట్టింది. ఇప్పుడు ప‌వ‌న్ ఉన్న‌ట్టుండి.. ఏమో అమిత్ షా చెప్తే పిఠాపురం వ‌దిలేసి కాకినాడ ఎంపీగా పోటీ చేస్తాను అని అన‌డంతో YSRCPకి కూడా షాక్ త‌గిలింది.

ALSO READ: ప‌వ‌న్ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం ఎమ్మెల్యే నేనే