Vanga Geetha: ఇప్ప‌టినుంచే ఆ ఆశ‌లు ఎందుకు ప‌వ‌న్?

Vanga Geetha: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) ఈసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదే సీటు నుంచి YSRCP త‌ర‌ఫున వంగా గీత పోటీ చేస్తున్నారు. అయితే త‌న‌ను ఓడించ‌డానికి వంగ గీత ఓట‌ర్ల‌కు ల‌క్ష‌లు ఇచ్చినా ఇస్తారని ప‌వ‌న్ ఆరోపించారు. దీనిపై వంగ గీత స్పందించారు. “” నాకు మా అన్న (చిరంజీవి) గారు సీటు ఇచ్చే సమయానికే నేను జిల్లా పరిషద్ చైర్మన్‌గా చేసాను, రాజ్యసభ ఎంపీగా చేశాను ఆ తరువాత ప్రజారాజ్యంలో చేరాను. నా సోదరుడికి (పవన్ కళ్యాణ్) నేను చెప్పేది ఒక్క‌టే. తెలుసుకొని మాట్లాడండి. ఇప్పటినుంచే ఎందుకు దింపుడుకల్లెం ఆశలు ? లక్ష ఇస్తారు ఓటుకి అని ఇవన్నీ ఎందుకు ఇప్పటి నుంచే “” అని మండిప‌డ్డారు.