Mukesh Ambani: పెళ్లి వేడుక స‌మ‌యంలో అంబానీ ఇంట భారీ చోరీ

Mukesh Ambani: ఇటీవ‌ల ముఖేష్‌, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మ‌ర్చెంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుక ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. గుజ‌రాత్ జామ్ న‌గ‌ర్‌లోని రిల‌య‌న్స్ గ్రీన్స్ ప్యాలస్‌లో ఈ వేడుక అట్ట‌హాసంగా జ‌రిగింది. అయితే.. ఈ వేడుక స‌మ‌యంలో అంతా బిజీగా ఉంటే తిరుచ్చికి చెందిన కొంద‌రు దొంగ‌లు అంబానీ వేడుక‌కు అతిథిగా వ‌చ్చిన వారి నుంచి దోచుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ఢిల్లీ పోలీసులు బ‌య‌ట‌పెట్టారు. గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌లో అతిథుల కార్లు పార్క్ చేసి ఉండ‌గా ఐదుగురు వ్య‌క్తులు మెర్సిడెజ్ బెంజ్ కారు నుంచి ఓ యాపిల్ ల్యాప్‌టాప్, రూ.10 ల‌క్ష‌ల క్యాష్ దోచుకున్నారు. రాజ్ కోట్ నుంచి ఢిల్లీకి చేరుకోగా అక్క‌డి పోలీసులు వీరిని ప‌ట్టుకున్నారు. విచార‌ణ‌లో ఒక్క రాజ్‌కోట్‌లోని 11 ప్రాంతాల నుంచి నాలుగు నెల‌లుగా చాలా చోరీల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలిసింది. ఆ త‌ర్వాత పోలీసులు ఆ కారు ఓన‌ర్‌ను గుర్తించి ల్యాప్‌టాప్, క్యాష్ అప్ప‌గించారు.

ALSO READ: Anant Radhika Wedding: వియ్యంకుల ఆస్తి చాలా త‌క్కువ‌..!

ALSO READ : Anant Radhika Wedding: అత్యంత ఖ‌రీదైన కానుక ఎవ‌రిచ్చారో తెలుసా?