Narayana Murthy: మ‌న‌వ‌డికి కానుక‌.. రూ.240 కోట్ల విలువైన వాటా!

Narayana Murthy: ఇన్‌ఫోసిస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు నారాయ‌ణ మూర్తి త‌న నాలుగు నెల‌ల మ‌న‌వ‌డికి అదిరిపోయే కానుక ఇచ్చారు. నారాయ‌ణ‌మూర్తి కుమారుడు రోహ‌న్ మూర్తి, అప‌ర్ణ కృష్ణ‌న్‌ల కుమారుడు ఏకాగ్ర 2023 న‌వంబ‌ర్‌లో జ‌న్మించాడు. ఏకాగ్ర నారాయ‌ణ‌మూర్తి, సుధామూర్తి దంప‌తుల‌కు మూడో మ‌న‌వ‌డు.

ఏకాగ్ర‌కు ఇన్‌ఫోసిస్‌లో రూ.240 కోట్ల విలువైన షేర్ల‌లో వాటా ఉన్న‌ట్లు నారాయ‌ణ మూర్తి ఎక్స్‌చేంజ్ ఫైలింగ్‌లో పేర్కొన్నారు. ఈ ర‌కంగా ఏకాగ్ర అత్యంత పిన్న వ‌య‌స్కుడైన మిలియ‌నీర్‌గా పేరుగాంచాడు. నారాయ‌ణ‌మూర్తి ఇన్ఫోసిస్ హోల్డింగ్స్ వాటా 0.40 శాతం నుంచి 0.36 శాతానికి ప‌డిపోయింది. 1981లో సుధామూర్తి నుంచి రూ.10,000 తీసుకుని ఇన్ఫోసిస్ ప్రారంభించారు నారాయ‌ణ‌మూర్తి. ఈరోజు అది భార‌త‌దేశంలోనే రెండో అతిపెద్ద టెక్ కంపెనీగా పేరుగాంచింది. (Narayana Murthy)