Delhi Liquor Case: వంద‌ల కోట్లు ఆప్ పార్టీకి ఇచ్చిన క‌విత‌?

Delhi Liquor Case: ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ స్కాంలో భాగంగా నిన్న ఈడీ.. భార‌త రాష్ట్ర స‌మితి (BRS) ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను (Kalvakuntla Kavitha) అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈడీ షాకింగ్ అంశాల‌ను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ప్ర‌వేశ‌పెట్టింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో క‌వితది కీల‌క పాత్ర అని ఈడీ రిపోర్ట్‌లో పేర్కొంది. సౌత్ లాబీ పేరుతో లిక్క‌ర్ స్కాంలో క‌విత కీల‌క పాత్ర పోషించార‌ట‌. ఆమ్ ఆద్మీ పార్టీకి వంద‌ల కోట్లు ఇవ్వడంలో క‌విత‌ది కీల‌క పాత్ర అని ఈడీ అంటోంది. క‌విత‌కు బినామీగా రామ‌చంద్ర పిళ్లై ఉన్నారని తెలిపింది. ఎంపీ మాగుంట ద్వారా క‌విత రూ.30 కోట్లు ఢిల్లీకి చేర్చార‌ని ఆరోపిస్తున్నారు. క‌విత ఫోన్లు స్వాధీనం చేసుకుని విచార‌ణ చేద్దామంటే అన్ని వివ‌రాల‌ను, ఆధారాల‌ను డిలీట్ చేసేసార‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ కోర్టు క‌విత‌కు ఏడు రోజుల పాటు క‌స్ట‌డీ విధించింది.