Elections ఖ‌ర్చుపై ఎన్నిక‌ల సంఘం ఏమంది?

Elections: భార‌త‌దేశంలో ఎన్నిక‌ల న‌గారా మోగింది. సార్వ‌త్రిక ఎన్నిక‌లు, అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల తేదీల‌ను ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంత వ‌ర‌కు డ‌బ్బు ఖ‌ర్చు చేయాల‌న్న అంశంపై ఎన్నిక‌ల క‌మిష‌న్ లిమిట్ విధించింది. ఎమ్మెల్యేలు అయితే రూ.38 ల‌క్ష‌ల వ‌ర‌కు.. అదే ఎంపీలు అయితే రూ. 90 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. ఇంత‌కంటే లిమిట్ దాటిన‌ట్లు తెలిస్తే క‌చ్చితంగా చ‌ట్టప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించింది.