Guntur Kaaram: టీవీలో ప్ర‌సార‌మ‌య్యేది ఎప్పుడంటే…?

Guntur Kaaram: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) న‌టించిన గుంటూరు కారం సినిమాలో త్వ‌ర‌లో టీవీలో ప్రసారం కాబోతోంది. దాదాపు 14 ఏళ్ల త‌ర్వాత త్రివిక్ర‌మ్, మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రూ.170 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్లు రాబ‌ట్టింది. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 9న నెట్‌ఫ్లిక్స్‌లో వ‌చ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లోనూ దుమ్ము దులిపేసింది. గుంటూరు కారం హిందీ వెర్ష‌న్ వ్యూస్ స‌లార్ కంటే ఎక్కువ‌గా ఉన్నాయి. ఇక ఈ సినిమా తొలిసారి టీవీలో ప్ర‌సారం కాబోతోంది. ఉగాదికి ఈ సినిమాను టీవీలో వేయాల‌ని టీం నిర్ణ‌యించుకుంది. అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే ఈ సినిమాను ఉగాదికి జెమిని టీవీలో చూడ‌చ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా మూడు రోజుల్లోనే 3.1 మిలియ‌న్ వ్యూస్ రాబ‌ట్టింది. ఇక జెమిని టీవీలో ఈ సినిమాను వేస్తే ఛానెల్ టీఆర్పీ రేటింగ్స్ రికార్డ్ బ‌ద్ద‌ల‌వుతుంద‌ని జెమిని టీవీ నిర్వాహ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ALSO READ: Mahesh Babu: పాకిస్థాన్‌లో టాప్‌ 10లో సూప‌ర్‌స్టార్..!