MS Dhoni: IPL 2025లో ధోనీ.. కుంబ్లే ఏమన్నారు?

MS Dhoni: మ‌హేంద్ర సింగ్ ధోనీ ఇత‌ర క్రికెట్ ఫార్మాట్ల నుంచి విశ్రాంతి తీసుకుని కేవ‌లం IPLలోనే ఆడుతున్నారు. గ‌తేడాది IPL టైటిల్‌ను గెలుచుకున్న చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai super Kings) సార‌థి ధోనీ.. ఈ ఏడాది ఐపీఎల్ ఆడ‌తారా లేదా అనే సందేహాలు 2023లోనే మొద‌ల‌య్యాయి. ఇదే విష‌యం గురించి ధోనీని అడ‌గ్గా.. నేను 2024 ఐపీఎల్‌లో ఆడ‌ను అని మీరు అనుకుంటున్నారు నేను కాదు అని స‌మాధానం ఇచ్చి ఫ్యాన్స్‌కు కాస్త ఊర‌ట‌నిచ్చారు.

అయితే.. 2025 ఐపీఎల్‌లోనూ ధోనీ కొన‌సాగుతారా లేదా అనే ప్ర‌శ్న‌పై ఇప్పుడు చ‌ర్చ మొద‌లైంది. దీనిపై సీనియ‌ర్ క్రికెట‌ర్ అనిల్ కుంబ్లే (Anil Kumble) స్పందిస్తూ.. ధోనీ ఇప్పుడప్పుడూ ఐపీఎల్ నుంచి విశ్రాంతి తీసుకోరు అనిపిస్తోంద‌ని అన్నారు. ఆయ‌న 2025 ఐపీఎల్‌లో ఆడినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదని తెలిపారు.

“” ఆట ప‌ట్ల నిబ‌ద్ధ‌త విష‌యంలో నాకు ధోనీ స‌చిన్ తెందుల్క‌ర్ ఒకేలా క‌నిపిస్తారు. ధోనీ కెప్టెన్‌గా ఉన్న‌ప్పుడు నేను కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నప్పుడు రాంచీలో ప్రాక్టీస్ సెష‌న్ జ‌రుగుతోంది. అక్క‌డికి ధోనీ రావాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే అది ఆప్ష‌న‌ల్ గేమ్. అయినా ధోనీ వ‌చ్చాడు. ఎందుకు వ‌చ్చావు అని అడిగితే.. ఊరికే ఉండాల‌నిపించింది అన్నాడు. సచిన్ కూడా అంతే. నేను ముంబై ఇండియ‌న్స్‌తో ఆడుతున్న‌ప్పుడు ఆప్ష‌న‌ల్ గేమ్ స‌మ‌యంలో స‌చిన్ కూడా మాతో పాటు బ‌స్సులో వ‌చ్చేవారు. వారిద్ద‌రూ ఈ విషయంలో ఒక్క‌టే. అది వారి గొప్ప‌త‌నం “” అని తెలిపారు కుంబ్లే.