Pawan Kalyan: జ‌న‌సేనాని పిఠాపురం ఎందుకు ఎంచుకున్న‌ట్లు?

Pawan Kalyan: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈసారి పిఠాపురం (Pithapuram) నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. చాలా మంది ఆయ‌న భీమ‌వ‌రం నుంచి పోటీ చేస్తార‌ని అనుకున్నారు. కానీ ఈరోజు జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వం కావ‌డంతో తాను పోటీ చేస్తున్న సీటును ప్ర‌క‌టించారు. 2019 ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం, గాజువాక నుంచి పోటీ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారు. దాంతో ఈసారి పిఠాపురంను ఎంచుకున్నారు.

పిఠాపురంలో ప‌వ‌న్ కుల వ‌ర్గానికి చెందిన ఓట‌ర్లు ఎక్కువ సంఖ్య‌లో ఉన్నార‌ని అందుకే ఈసారి అక్కడి నుంచి పోటీ చేయాల‌నుకున్నార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. గ‌తంలో భీమ‌వ‌రం, గాజువాక నుంచి పోటీ చేస్తే ఓట్లు ప‌డ‌లేదు. కానీ పిఠాపురం నుంచి జ‌న‌సేన‌కు మంచి మ‌ద్ద‌తు ల‌భించింద‌ట‌. జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్ధుల‌ను నిల‌బెట్టే క్ర‌మంలో పార్టీ పోటీ చేయాల‌నుకునే సీట్ల నుంచి బాగా స‌ర్వేలు చేయించింద‌ట‌. ఈసారి భీమ‌వ‌రం, గాజువాక నుంచి కూడా స‌ర్వేలు చేయించ‌గా.. ఈ సారి అనుకూలంగా రాలేద‌ని తెలుస్తోంది. కాస్తో కూస్తో పిఠాపురం నుంచి మంచి రెస్పాన్స్ రావ‌డంతో ప‌వ‌న్ ఆ సీటును ఎంచుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ALSO READ: Pithapuram: ప‌వ‌న్‌ను ఓడించి తీర‌తా..!