Pithapuram: ప‌వ‌న్‌ను ఓడించి తీర‌తా..!

Pithapuram: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) ఎట్ట‌కేల‌కు తాను పోటీ చేయ‌బోయే స్థానాన్ని ఈరోజు ప్ర‌క‌టించారు. తాను భీమ‌వ‌రం నుంచి కాకుండా ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో పిఠాపురం తెలుగు దేశం పార్టీ నేత ఎస్వీఎస్ఎన్ వ‌ర్మ మండిప‌డ్డారు. తన‌కు పిఠాపురం టికెట్ ఇస్తార‌నుకుంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను దించార‌ని.. త‌న స‌త్తా చూపిస్తాన‌ని స‌వాల్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు ఫోన్ చేసారు.

ఇలా చేయ‌డం ఏమీ బాగోలేద‌ని మండిప‌డ్డారు. వ‌ర్మ‌కు స‌ర్దిచెప్పేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించినా ఆయ‌న విన‌లేదు. పిఠాపురంలో ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేసి ప‌వ‌న్‌పై గెలుస్తాన‌ని స‌వాల్ విసిరారు. 20 సంవ‌త్స‌రాలుగా తెలుగు దేశం పార్టీ ప‌ట్ల విధేయ‌త చూపుతూ వ‌స్తున్న త‌న‌కు మంచి బ‌హుమాన‌మే అందింద‌ని వ‌ర్మ మండిప‌డ్డారు. వ్యాపారాలు, కుటుంబాన్ని వ‌దిలేసి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లే త‌న కుటుంబం అనుకుని ప‌ని చేసాన‌ని అన్నారు. పోస్ట‌ర్ల నుంచి చంద్ర‌బాబు నాయుడు, నారా లోకేష్ బొమ్మ‌ల‌ను తీయించేసిన వ‌ర్మ‌.. వాటిని త‌న అనుచ‌రుల చేత కాల్చి బూడిద చేయించారు. ఇక పిఠాపురం ప్ర‌జ‌లే నిర్ణ‌యం తీసుకుంటారు అంటూ ఆగ్ర‌హానికి గుర‌య్యారు.

ALSO READ: Pawan Kalyan: అందుకే ఎవ‌రు తిట్టినా నాకు సిగ్గు అనిపించ‌దు

ALSO READ: Pawan Kalyan: అస‌లైన అంద‌రివాడు..!