Sridhar Babu: మంత్రి శ్రీధర్ బాబుకు కరెంట్ కష్టాలు!

Sridhar Babu: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో అదనపు తరగతులను ప్రారంభించడానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. మంత్రి సభా వేదిక దిగుతుండగానే కరెంటు పోయింది. దాదాపు పావు గంట సేపు ఎదురుచూసినా కరెంటు రాకపోవడంతో విద్యార్థులు చీకట్లోనే తమ సమస్యలు చెప్పుకొని వినతి పత్రం అందించారు.

గ‌తంలో మంత్రి సీత‌క్క కూడా స‌చివాలయంలో ఇలాగే ప్రెస్ మీట్‌లో మాట్లాడుతుండ‌గా క‌రెంట్ పోయింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌స్తే క‌రెంట్ స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని ప్ర‌తిప‌క్షాలు కామెంట్స్ చేస్తున్న నేప‌థ్యంలో ఇలా వారు ప‌నిలో ఉన్న స‌మ‌యంలోనే క‌రెంట్ పోవ‌డం మ‌రింత చ‌ర్చ‌నీయాంశంగా మారింది.