Avinash Reddy బెయిల్ ర‌ద్దు?

Avinash Reddy: దివంగ‌త నేత వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో ప్ర‌ధాన అనుమానితుడిగా ఉన్న YSRCP నేత‌, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ ర‌ద్దు అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ కేసులో అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి త‌న‌కు అవినాష్ రెడ్డి నుంచి ముప్పు ఉంద‌ని.. సాక్ష్యం మార్చి చెప్పాల‌ని క‌డ‌ప జైల్లో ఉన్న‌ప్పుడు డ‌బ్బులు ఆశ చూపి టార్చ‌ర్ పెట్టారని ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ సీబీఐ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసాడు. వెంట‌నే అవినాష్ రెడ్డి బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. లేదంటే అవినాష్ వ‌ల్ల త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని పేర్కొన్నాడు. ఈ కేసు వాద‌న‌లు విన్న సీబీఐ హైకోర్టు.. బెయిల్ ర‌ద్దుపై తీర్పును రిజ‌ర్వ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. క‌చ్చితంగా ఈసారి అవినాష్ రెడ్డి బెయిల్ ర‌ద్దు అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.