Kodali Nani: ష‌ర్మిళ‌మ్మా.. ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా?

Kodali Nani: YSRCP నేత కొడాలి నాని వైఎస్ ష‌ర్మిళ‌పై (YS Sharmila) మండిప‌డ్డారు. ష‌ర్మిళ‌మ్మా.. ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా అంటూ విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీలో తాను చేర‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌ణిపూర్‌లో అల్ల‌ర్లు జ‌రుగుతున్న‌ప్పుడు కాంగ్రెస్ నేత‌లు మాత్ర‌మే వారిని ఆదుకున్నారని అందుకే ఆ పార్టీలో చేరాన‌ని ష‌ర్మిళ ఓ సంద‌ర్భంలో అన్నారు. అస‌లు మ‌ణిపూర్‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌కు.. ష‌ర్మిళ కాంగ్రెస్‌లో చేర‌డానికి.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని అన‌రాని మాట‌లు అన‌డానికి ఏమ‌న్నా సంబంధం ఉందా? అని ప్ర‌శ్నించారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పోయిన సారి వ‌చ్చిన సీట్లు కూడా రావ‌ని.. రాబోయే రోజుల్లో మ‌ళ్లీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అవుతార‌ని అన్నారు. ఎంత మంది ఏం చేసినా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెంట్రుక కూడా పీక‌లేర‌ని అన్నారు.

ALSO READ: Janasena పోటీ చేసే స్థానాలు ఇవే..!

“”” అస‌లు ష‌ర్మిళ మ‌ణిపూర్ గురించి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎందుకు మాట్లాడుతోందో అర్థంకావ‌డంలేదు. ఎక్క‌డ మ‌ణిపూర్‌? ఎక్క‌డ ఆంధ్ర‌ప్ర‌దేశ్? మ‌ణిపూర్‌లో ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగితే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏం చేస్తారు? పోనీ మణిపూర్‌పై అంత ప్రేమ ఉంటే ష‌ర్మిళ వెళ్లిందా? ఆమె భ‌ర్త బ్ర‌ద‌ర్ అనిల్ వెళ్లారా? నాది తెలంగాణ నేను ఇక్క‌డే పుట్టాను పెరిగాను అన్న ష‌ర్మిళ ఎందుకు తెలంగాణ‌లో ఉన్న‌ప్పుడు మ‌ణిపూర్ గురించి మాట్లాడ‌లేదు? ఎక్క‌డ ఎన్నిక‌లు ఉంటే అక్క‌డికి వెళ్లి ప్ర‌చారం చేసుకుంటున్నారు. సిగ్గులేకుండా భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌ణిపూర్‌లో ఊచ‌కోత కోసింది అంటూనే మ‌ళ్లీ భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తులో ఉన్న తెలుగు దేశం పార్టీని గెలిపించాల‌ని మాట్లాడుతోంది. ఢిల్లీలో తెలుగు వారు అక్కడి నేత‌ల కాళ్ల ద‌గ్గ‌ర బ‌తుకుతున్నార‌ని తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడాల‌ని నంద‌మూరి తార‌క రామారావు తెలుగు దేశం పార్టీని పెట్టారు. ఇప్పుడు అదే పార్టీని సిగ్గు లేకుండా చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీలో తాక‌ట్టు పెట్టేసారు అని విమ‌ర్శించారు (Kodali Nani)