Janhvi Kapoor: వైర‌ల్‌గా మారిన జాన్వీ కపూర్ ఫోన్ వాల్ పేపర్

Janhvi Kapoor: హీరోయిన్ జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేసింది తక్కువ సినిమాలే అయిన స్టార్ హీరోయిన్స్‌తో సమానంగా పాపులారిటీని సంపాదించుకుంది. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టిన జాన్వీ అతి తక్కవ కాలంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను తన అందంతో అలరిస్తుంటుంది.

శ్రీదేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ త్వరలోనే దేవర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత రామ్ చరణ్ 16వ సినిమా కుడా ఓకే చేసుకుంది. ఇక బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాలో అయితే రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంది. జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా జాన్వీ కపూర్ ఫోన్ వాల్ పేపర్ ఏంటో తెలిసిపోయింది. ముంబై వీధుల్లో బాలీవుడ్ స్టార్స్ కనిపిస్తే కెమెరాలు వెంబడిస్తాయి అని తెలిసిందే. అయితే, జాన్వీ కనిపించగా కెమెరాలు జాన్వీని ఫోటోలు, వీడియోలు తీశాయి. అయితే జాన్వీ చేతిలో తన ఫోన్ పట్టుకొని వెళ్లి కార్ లో కూర్చుంది. ఆ సమయంలో తన ఫోన్ స్క్రీన్ పై ఉన్న వాల్ పేపర్ కనిపించింది. దీంతో ఆ ఫోటో కాస్తా వైరల్ గా మారింది. (Janhvi Kapoor)

ALSO READ: Mukesh Ambani: అంబానీ దంప‌తులు ఆ అంత‌స్తులోనే ఎందుకుంటారు?

ఇంతకీ జాన్వీ కపూర్ ఫోన్ వాల్ పేపర్ ఏంటంటే.. జాన్వీ చిన్నప్పుడు తన తల్లి శ్రీదేవితో కలిసి దిగిన ఫోటోని తన ఫోన్ వాల్ పేపర్ గా పెట్టుకుంది. దీంతో ఆ ఫోటో గూగుల్ లో వెతికేసి మరీ వైరల్ చేస్తున్నారు అభిమానులు. రోజూ శ్రీదేవిని చూడకుండా తన డే మొదలవ్వదని, తల్లి అంటే తనకు అంత ఇష్టమని, చిన్నప్పుడు తల్లితో ఉన్న జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకోడానికే జాన్వీ ఆ ఫోటో వాల్ పేపర్ గా పెట్టుకుందని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి జాన్వీ వాల్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

హీరోయిన్ జాన్వీ కపూర్ బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ అక్కడ ఇప్పటి వరకు ఒక మంచి సక్సెస్ రాలేదు. దీంతో తన తల్లిని స్టార్ హీరోయిన్ ని చేసిన సౌత్ ఇండస్ట్రీ వైపు జాన్వీ చూపు తిప్పారు. తన తల్లి లాగానే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలని.. ముందుగా తెలుగు సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు.

ఇక తాజాగా మరో పాన్ ఇండియా సినిమాలో కూడా అవకాశం కొట్టేసినట్లు సమాచారం. అల్లు అర్జున్ నటిస్తున్న తాజా మూవీ పుష్ప 2లో జాన్వీ కపూర్ కనిపించబోతుందట. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 1లో ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ సాంగ్ ఎంత పెద్ద హిట్టు అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ పాటలో అల్లు అర్జున్ తో కలిసి సమంత వేసిన స్టెప్పులు ప్రతి ఒక్కర్ని విజుల్స్ వేయించాయి. ఇక ఆ సాంగ్ అంత పెద్ద హిట్టు అవ్వడంతో.. సెకండ్ పార్టులోని ఐటెం సాంగ్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి.

పుష్ప 2 మూవీ లోదేవిశ్రీ ప్రసాద్ ఎలాంటి మ్యూజిక్ ఇవ్వబోతున్నారు..? ఆ పాటలో ఏ భామ కనిపించబోతుంది..? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. అయితే తాజాగా పుప్ప మూవీలో మాదిరిగానే పుష్ప 2లో మరో స్పెషల్ సాంగ్ సిద్దం చేసినట్టు తెలుస్తున్నది. ఆ పాటలో యంగ్ హీరోయిన్‌ చూపించాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

గత కొన్నిరోజులుగా ఈ సెకండ్ పార్టులోని ఐటెం సాంగ్ లో దిశా పటానీ కనిపించబోతుందని వార్తలు వినిపించాయి. కానీ తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ ఐటెం సాంగ్ లో జాన్వీ కపూర్, అల్లు అర్జున్ తో కలిసి చిందేయనుందని టాక్. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు గాని, అల్లు అర్జున్ అభిమానులు.. ఈ కాంబినేషన్ లో ఐటెం సాంగ్ బాగుంటుందని ఫీల్ అవుతున్నారు. మరి ఫైనల్ గా పుష్ప ఏ భామతో చిందేస్తాడో చూడాలి.