Kumari Aunty: సీరియల్స్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసిన కుమారి ఆంటీ..!

Kumari Aunty: కుమారి ఆంటీ.. కుమారి ఆంటీ.. కుమారి ఆంటీ.. ఇప్పుడు ఇక్కడ చూసినా ఇదే మాట. ఆమె ఫుడ్‌కి బీభత్సమైన ప్రమోషన్ వచ్చేసింది. ఇన్నిరోజులు ఎంటర్టైన్మెంట్ షోలలో మాత్రమే కనిపించిన కుమారి ఆంటీ.. ఇప్పుడు సీరియల్స్ లోకి కూడా స్పెషల్ గెస్ట్ గా వచ్చేస్తుంది.

హైదరాబాద్ లో ఒక చిన్న ఫుడ్ స్టాల్ పై వ్యాపారం చేసుకునే కుమారి ఆంటీ.. సోషల్ మీడియా ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమ్ ని సంపాదించుకుంది. రెండు లివర్లు వెయ్యి రూపాయిలు అనే ఒక్క మాటతో సోషల్ మీడియాని షేక్ చేసింది. ఇక ఆ తరువాత కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి ప్రతి ఒక్కరు క్యూ కట్టారు. అంతేకాదు టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా కుమారీ ఆంటీ స్టాల్ కి వెళ్లి మూవీ ప్రమోషన్స్ చేసారు.

దీంతో కుమారి ఆంటీ స్టాల్ దగ్గర రోజు ఒక జాతర వాతావరణం కనిపించింది. అది కాస్త ట్రాఫిక్ ఇష్యూ కావడం, ఆ తరువాత పోలీసులు ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ పోలిసుల ఎంట్రీతో కుమారి ఆంటీ పేరు.. సోషల్ మీడియా నుంచి ప్రైమ్ మీడియాకి వచ్చింది. ఆ పోలిసుల ఇష్యూ పెద్దది అయ్యి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్లడం, ఆయన కూడా ఆ ఫుడ్ స్టాల్ గురించి రియాక్ట్ అవ్వడంతో.. కుమారి ఆంటీ ఓవర్ నైట్ లో సోషల్ మీడియా స్టార్ అయ్యిపోయింది.

ఇక ఆమెకు వచ్చిన స్టార్‌డమ్ తెలుగు టెలివిజన్ రంగం ఓ రేంజ్ లో ఉపయోగించేసుకుంటుంది. తెలుగు ఛానల్స్ లో వచ్చే పలు ఎంటర్టైన్మెంట్ షోలకు కుమారి ఆంటీని తీసుకు వస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంటికి కుమారి ఆంటీని పరిచయం చేస్తున్నారు. ఇక ఇన్నిరోజులు ఎంటర్టైన్మెంట్ షోలలో మాత్రమే కనిపించిన కుమారి ఆంటీ.. ఇప్పుడు సీరియల్స్ లోకి కూడా స్పెషల్ గెస్ట్ గా వచ్చేస్తుంది. (Kumar Aunty)

ప్రముఖ తెలుగు ఛానల్ జీ తెలుగులో ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రసారమయ్యే.. ‘రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ సీరియల్ లో కుమారి ఆంటీ స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని సీరియల్ నిర్వాహకులు రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మరి సీరియల్ లో కుమారి ఆంటీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.

అయితే టీవీ షోలు, సీరియల్స్‌తో బిజీగా మారిన కుమారి ఆంటీ తన ఫుడ్ కోర్ట్ దగ్గరకు కూడా వెళ్లడం మానేసిందంట. ఇక ఆహా.. ఓహో అంటూ ఆమె ఫుడ్ గురించి చాలామంది గొప్పలు చెప్పారు కానీ.. తీరా ఆ క్రేజ్ చూసి ఫుడ్ టేస్ట్ చేసిన వాళ్లు మాత్రం పెదవి విరుస్తున్నారు. యూట్యూబ్‌లో డబ్బా కొట్టినంతగా అయితే టేస్ట్ లేదని.. ఇంకా చెప్పాలంటే.. కుమారి అంటూ ఫుడ్ స్టాల్ దగ్గరకంటే.. ఆ పక్కనే ఉండే ఫుడ్ కోర్టుల వద్ద భోజనం బాగుంటదని.. రేట్లు కూడా అక్కడే తక్కువని అంటున్నారు. చాలామంది కుమారి ఆంటీని చూడ్డానికి వెళ్తున్నా.. అక్కడ మాత్రం కుమారి ఆంటీ కనిపించడం లేదట. డబ్బుకి డబ్బు.. క్రేజ్‌కి క్రేజ్ వస్తుంటే.. ‘నాన్నా.. రెండు లివర్లు ఎక్స్ ట్రా.. మొత్తం 1000 అయ్యింది’ అని ఇంకా ఎందుకు అంటుంది చెప్పండీ. ఇప్పుడు ఆమెకు సెలబ్రిటీ రేంజ్ అన్నమాట.