Mahboobabad: క‌న్న‌బిడ్డల‌కు విషమిచ్చి పారిపోయిన త‌ల్లిదండ్రులు

Mahboobabad: మ‌హ‌బూబాబాద్‌లో హృద‌య విదార‌క ఘట‌న చోటుచేసుకుంది. అంకన్నగూడెంకు చెందిన అనిల్ కుమార్, దేవి దంపతులకు నాలుగేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి లోహిత (2) జశ్విత (7 నెలలు) అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఏమైందో తెలియదు కానీ ఇద్దరు పిల్లలకు పాల డబ్బాలో విషం కలిపి తాగించి తల్లితండ్రులు ఇద్దరు బైక్ తీసుకొని పారిపోయారు. తాత వెంకన్న విష‌యం తెలుసుకుని వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు.