Janasena: ఇంకాస్త త్యాగం చేయాలంటున్న BJP..!

Janasena: ఇప్ప‌టికే జ‌న‌సేన పార్టీ.. భార‌తీయ జ‌న‌తా పార్టీతో (Bharatiya Janata Party) పొత్తు కోసం ఎంపీ స్థానాల్లో ఒక స్థానాన్ని త్యాగం చేసింది. ఈ త్యాగంతోనే తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల‌తో చేతులు క‌లిపింది భార‌తీయ జన‌తా పార్టీ. అయితే జ‌న‌సేన 24 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న నేప‌థ్యంలో.. ఇంకొన్ని సీట్లు త‌మ‌కు ఇవ్వాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ డిమాండ్ చేస్తోంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ నేప‌థ్యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత శివ ప్రకాష్ రేపు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను సంప్ర‌దించ‌నున్నారు. ఇందుకు జ‌న‌సేనాని ఒప్పుకుంటారా లేదా అనే అంశంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.