Varla Ramaiah: చంద్ర‌బాబు గెలవాల‌ని వైసీపీ నేతలూ కోరుకుంటున్నారు

Varla Ramaiah: రానున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) గెల‌వాల‌ని YSRCP నేత‌లు కూడా కోరుకుంటున్నార‌ని అన్నారు తెలుగు దేశం పార్టీ ఉపాధ్య‌క్షుడు వ‌ర్ల రామ‌య్య‌. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో అన్నీ అవినీతులు, అక్ర‌మ‌లే జ‌రిగాయ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌లు కూడా విసిగిపోయార‌ని తెలిపారు. చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ పార్టీలో ప్ర‌కంప‌న‌లు సృష్టించింద‌ని అన్నారు.

“” జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) మంచి న‌టుడు. తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్‌స్టార్. ఆయ‌న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌ను అణ‌చి వేయాల‌ని చాలా గ‌ట్టిగా ప్రయ‌త్నిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ల్ల తెలుగు దేశం పార్టీకి మంచే జ‌రుగుతుంది. చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిసి అధికారంలోకి వ‌స్తారు. ఎవ‌రైతే ఓట్లు వేసి గెలిపించారో వారినే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అణ‌చి వేయాల‌ని చూసారు. ద‌ళితుల‌పై దాడులు చేస్తున్నారు. సీఎం అయిన‌ప్ప‌టి నుంచి ద‌ళితుల‌పై ఉన్న కేసుల గురించి ప‌ట్టించుకున్న పాపాన పోలేదు.

ఎస్సీలు, ఎస్టీలు జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఉన్నారు. ప్ర‌జాస్వామ్య పాల‌న అనేదే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి తెలీదు. ఒక ప్లాన్ లేదు. స్ట్రాటెజీ లేదు. కేవ‌లం కొంద‌రు నేత‌ల‌కు డ‌బ్బులు ఇచ్చి వారిని త‌న ప‌క్క‌న పెట్టుకోవ‌డమే తెలుసు. అస‌లు అభివృద్ధి అనే మాటే జ‌గ‌న్‌కు తెలీదు. ఏపీలోని చాలా మందికి భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ విజ‌న్ ప‌ట్ల అవ‌గాహ‌న ఉంది. ఇత‌ర దేశాల‌తో ఆయ‌న‌కున్న స‌త్సంబంధాల ప‌ట్ల ఏపీ ప్ర‌జ‌లు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఏపీ ప్ర‌జ‌లు మోదీతోనే ఉన్నారు. ఇక భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తు విష‌యంలో క‌న్‌ఫ్యూజ్ ఉంది. ఇక్క‌డ భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలుగు దేశం పార్టీకి సాయం చేస్తోంది అనుకుంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. “”” అని తెలిపారు.