Upasana Kamineni: చ‌ర‌ణ్‌తో పెళ్లి.. క‌ష్టం అనిపించింది

Upasana Kamineni: టాలీవుడ్‌లో ప‌వ‌ర్ క‌పుల్ అన‌గానే ముందుగా గుర్తొచ్చేది మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ (Ram Charan), ఉపాస‌న దంప‌తులు. కొంత‌కాలం పాటు ప్రేమించుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వీరిద్ద‌రిదీ ప‌దేళ్ల అనుబంధం. ఇటీవ‌ల వీరిద్ద‌రూ పండంటి ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చారు. పాప‌కు క్లీంకార అనే చ‌క్క‌ని పేరు పెట్టారు. వీరిద్ద‌రి కుటుంబ నేప‌థ్యాలు వేరు. ఉపాస‌న అపోలో హాస్పిట‌ల్స్ వైస్ ఛైర్మ‌న్‌గా వ్య‌వ‌హరిస్తున్నారు. మ‌రోప‌క్క రామ్ చ‌ర‌ణ్‌ది సినీ నేప‌థ్యం. ఒక‌రిది వైద్యం.. మ‌రొక‌రిది వినోదం. కానీ ఈ రెండూ రంగాల్లో మాత్రం దంప‌తులు తెగ రాణించేస్తున్నారు.

అయితే అస‌లు సినీ నేప‌థ్యంలో ఏమాత్రం సంబంధం లేని రామ్‌చ‌ర‌ణ్‌ను పెళ్లి చేసుకున్నప్పుడు చాలా క‌ష్టం అనిపించింద‌ని అన్నారు ఉపాస‌న. ఒక స్టార్ న‌టుడిని పెళ్లి చేసుకోవ‌డం అనేది కాస్త క్లిష్ట‌మైన అంశ‌మే అని అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ ఇప్పుడు తాను చ‌ర‌ణ్‌కు నీడ‌లా మారినందుకు ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. చ‌ర‌ణ్‌కు నీడ‌లా ఉండ‌టంలో ఉన్న ఆనందం మాట‌ల్లో వివ‌రించలేనిద‌ని పేర్కొన్నారు. త‌న రంగంలో తాను ఎదుగుతుంటే చ‌ర‌ణ్ వెన‌క నిల‌బ‌డేందుకు కూడా సిద్ధ‌ప‌డ‌తాడ‌ని… ఎక్క‌డా ఇగోకి పోడ‌ని తెలిపారు. చ‌ర‌ణ్‌లో త‌న‌కు న‌చ్చేది ఈ అంశ‌మే అని పేర్కొన్నారు. ఉపాస‌న ఒక స్టార్ భార్య మాత్ర‌మే కాద‌ని అంత‌కుమించి ఆమె ఎన్నో సాధించింద‌ని చ‌ర‌ణ్ కూడా త‌న భార్య‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. (Upasana Kamineni)

ALSO READ: Ram Charan అందుకు అంబానీ నుంచి డ‌బ్బు తీసుకున్నారా?

ఎంత స్టార్ న‌టుడైనా భార్య ముందు ఆ స్టార్‌డం ప‌నికిరాద‌ని రుజువు చేసారు చ‌ర‌ణ్‌. వీరిద్ద‌రూ ఇటీవ‌ల అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. ఇద్ద‌రూ ప్రైవేట్ జెట్‌లో గుజ‌రాత్‌లోని జామ్ న‌గ‌ర్‌కు వెళ్లారు. అయితే ఫ్లైట్‌లో ఉపాస‌న‌కు కాళ్లు లాగుతున్నాయంటే.. చ‌ర‌ణ్ ఉపాస‌న కాలు నొక్కారు. ఆ స‌మ‌యంలో ప‌క్క‌నే ఉన్న వ్య‌క్తి ఫోటో తీయ‌డంతో అది కాస్తా సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యింది. ఎంత స్టార్ న‌టుడైనా భార్య ముందు ఆ స్టార్‌డం ప‌నికి రాదు అని కొంద‌రు నెగిటివ్ కామెంట్స్ పెట్ట‌గా..చాలా మ‌టుకు భార్యాభ‌ర్త‌లంటే ఇలా ఉండాలి అంటూ తెగ పొగిడేసారు. త‌మ‌కు కూడా చ‌ర‌ణ్ లాంటి భ‌ర్త రావాలంటూ అమ్మాయిలు.. ఉపాస‌న లాగా అర్థం చేసుకునే భార్య రావాల‌ని అబ్బాయిలు కామెంట్స్ పెట్టారు.

ఒక చ‌ర‌ణ్ సినిమా విష‌యాల‌కొస్తే.. ప్ర‌స్తుతం ఆయ‌న గేమ్ ఛేంజ‌ర్‌తో బిజీగా ఉన్నారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పుడే చెప్ప‌లేం. ఎందుకంటే ఇంకా కాస్త షూటింగ్ మిగిలి ఉంది. ఇందులో కియారా అడ్వాణీ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో శంక‌ర్ గ్రాండ్‌గా సినిమాను తీస్తున్నారు. త‌ర్వాత చ‌ర‌ణ్‌కు ఆచార్య‌తో పెద్ద షాక్ త‌గిలింది. దాంతో గేమ్ ఛేంజ‌ర్‌తో అయినా మ‌ళ్లీ ట్రాక్‌లో ప‌డాల‌ని.. ఫ్యాన్స్‌ను ఖుష్ చేయాల‌ని చ‌ర‌ణ్ అనుకుంటున్నారు. అందుకే ఎంత ఆల‌స్యం అయినా షూటింగ్ మాత్రం ఎలాంటి గంద‌ర‌గోళం లేకుండా జ‌రిగేలా చూస్తున్నారు. దీంతో పాటు ఉప్పెన ఫేం బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వంలో కూడా చ‌ర‌ణ్ ఓ స్పోర్ట్స్ డ్రామాలో న‌టించ‌నున్నారు. ఇందులో జాన్వి క‌పూర్ హీరోయిన్‌గా క‌న్ఫామ్ అయ్యారు.