NTR బర్త్ డే స్పెషల్​.. ఆ రెండు సూపర్​ హిట్​ సినిమాల రీరిలీజ్​!

‘నిన్ను చూడాలని’ అంటూ టాలీవుడ్​ హీరోగా అడుగు పెట్టి ‘ఆర్​ఆర్​ఆర్​’తో పాన్​ ఇండియా స్టార్​గా ఎదిగారు యంగ్​ టైగర్​ ఎన్టీఆర్. ఈ సంవత్సరం ఎన్టీఆర్​ కెరీర్​లోనే అత్యుత్తమమైనదిగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ వేదికలపై మెరిసిన తారక్​, ప్రపంచం మొత్తాన్నీ ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ మీడియా సైతం తారక్​ టాలెంట్​, వ్యక్తిత్వాన్ని పొగుడుతూ ఆర్టికల్స్​ ప్రచురించింది. ఇక, వచ్చే నెలలో ఎన్టీఆర్​ పుట్టినరోజు రానుండటంతో ఈసారి తారక్​ బర్త్​డేని మరింత ఘనంగా జరిపేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా తారక్​ కెరీర్​లో మైలురాళ్లుగా నిలిచిన ఆది, సింహాద్రి సినిమాలను రీరిలీజ్​ చేయనున్నారు. మే 20న ఎన్టీఆర్​ పుట్టినరోజు కాగా, ఆ రోజున ఆది సినిమాను రీరిలీజ్​ చేయనున్నారు దర్శకనిర్మాతలు.

ఇక సింహాద్రి సినిమాను ఎప్పుడు రీరిలీజ్​ చేసేదీ ఏప్రిల్​ 7న వీడియో, పోస్టర్​ రూపంలో ప్రకటిస్తామని తెలిపారు. ఈ లెక్కన మే నెలంతా ఎన్టీఆర్​ సినిమాలతో మరోసారి ప్రేక్షకులకు పండగే అని తెలుస్తోంది. ఆది సినిమాకు వివి వినాయక్ దర్శతక్వం వహించగా.. నల్లమల్లపు శ్రీనివాస్ నిర్మించారు. తారక్​ సరసన కీర్తి చావ్లా నటించారు. 2002 లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచనలం సృష్టించింది. ఇక ఈ సినిమాతో పాటు సింహాద్రి సినిమా సినిమాలను కూడా రీరిలీజ్ చేయనున్నారట. అయితే ఈ విషయంలో మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఎన్టీఆర్​, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా సింహాద్రి. యాక్షన్​, ఎమోషన్స్​, ఫ్యామిలీ బ్యాక్​డ్రాప్​లో వచ్చిన ఈ సినిమా సూపర్​ హిట్​గా నిలిచి వంద సెంటర్లలో 250 రోజుల పండుగ జరుపుకుంది. ఈ సినిమాలో తారక్​ సరసన భూమికా చావ్లా, అంకిత నటించగా నాజర్​ కీలకపాత్రలో కనిపించారు.

ప్రస్తుతం తారక్​, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్​30 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా షూటింగ్​ జోరుగా కొనసాగుతోంది. యాక్షన్ సీన్స్‌ షూట్​ చేస్తున్నట్టు టాక్​. ఈ సినిమాలో తారక్​ సరసన జాన్వీ కపూర్​ నటిస్తుండగా మరో హీరోయిన్​కి కూడా అవకాశం ఉందట. రెండో హీరోయిన్​గా టాలీవుడ్​ బేబమ్మ కృతి శెట్టి ఛాన్స్​ కొట్టేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న విడుదలకానుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా ఐలాండ్ & పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూట్‌ను ముఖ్యంగా హైదరాబాద్‌, వైజాగ్‌, గోవాలో వేసిన సెట్స్‌లో జరుపునున్నారని సమాచారం.