Nayanthara: విడాకుల రూమ‌ర్స్.. న‌య‌న్ షాకింగ్ పోస్ట్

Nayanthara: లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార.. త‌న భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ (Vignesh Shivan) నుంచి విడిపోనున్న‌ట్లు ఎప్ప‌టినుంచో వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఇందుకు కార‌ణం న‌య‌న్.. ఇన్‌స్టాగ్రామ్‌లో విఘ్నేష్‌ను అన్‌ఫాలో చేయ‌డ‌మే. దాంతో ఇది కాస్తా అటు టాలీవుడ్‌లో ఇటు కోలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ మరుస‌టి రోజే న‌య‌న్ త‌న భ‌ర్త గురించి పోస్ట్ పెడుతూ రూమ‌ర్స్‌కు చెక్ పెట్టారు. అయితే ఈరోజు మ‌ళ్లీ ఓ షాకింగ్ పోస్ట్ పెట్టి అభిమానుల‌ను గంద‌ర‌గోళానికి గురిచేసారు న‌యన్. ఐయామ్ లాస్ట్ అని పోస్ట్ పెట్టి ఏం జ‌రిగిందో చెప్ప‌కుండా అలా వ‌దిలేసారు. దాంతో న‌య‌న్ ఫ్యాన్స్ ఏం జ‌రిగింది.. అంతా ఓకేనా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. చాలా మంది వీరిద్ద‌రి వైవాహిక జీవితంలో ఏదో స‌మ‌స్య ఉంద‌ని అది బ‌య‌టికి చెప్ప‌లేక ఇలాంటి పోస్టులు పెడుతున్నార‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఈ మ‌ధ్య‌కాలంలో సినీ సెల‌బ్రిటీల‌కు ఇదో ట్రెండ్ అయిపోయింది. దాంప‌త్య జీవితంలో స‌మ‌స్య‌లు వ‌స్తే ముందుగా వారు చేసే ప‌ని సోష‌ల్ మీడియాలో ఒక‌రినొక‌రు అన్‌ఫాలో చేసుకోవ‌డం. ఆ త‌ర్వాత కాస్త సోష‌ల్ మీడియాలో వారి గురించి బాగా చ‌ర్చ జ‌రిగేలా చేస్తారు. కొన్ని రోజులు స‌స్పెన్స్‌లో ఉంచి ఆ త‌ర్వాత అస‌లు విష‌యాన్ని ప్ర‌క‌టిస్తారు. స‌మంత- నాగ‌చైత‌న్య‌, సానియా మీర్జా – షోయెబ్ మాలిక్.. ఇంకా చాలా మంది విష‌యంలో ఇదే జ‌రిగింది. ఇప్పుడు న‌య‌న్ త‌న భ‌ర్త‌ను మ‌ళ్లీ ఫాలో అవుతున్నారు కాబ‌ట్టి క‌లిసే ఉన్నార‌నుకోవాలా? లేదా.. ప‌బ్లిసిటీ కోసం ఏద‌న్నా ప్ర‌క‌టించ‌డానికి ఇలా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.

కాగా అయిదేళ్లు ప్రేమలో మునిగితేలిన ఈ జంట 2022 జూన్‌లో మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ ప్రముఖులు, సన్నిహితులు సమక్షంలో ఈ జంట రెండేళ్ల క్రితం ఏడడుగులు వేశారు. పెళ్లయిన ఆరు నెలలకు వీరికి ఇద్దరు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. సరోగసి ద్వారా నయన్‌-విఘ్నేశ్‌ శివన్‌లు కవలలకు తల్లిదండ్రులయ్యారు. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక పెళ్లి తర్వాతే ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన నయన్‌ తరచూ తన కుమారుల ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ మురిసిపోతుంది. అయితే ఆమెకు ఇన్‌స్టాలో ప్రస్తుతం 78 లక్షల‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. (Nayanthara)

ALSO READ: Nayanthara: విడాకులు తీసుకోబోతున్నారా?

సినిమాల విషయానికొస్తే.. గతేడాది ‘జవాన్‌’తో పాన్‌ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార.. ప్రస్తుతం ‘టెస్ట్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఆర్‌.మాధవన్‌, సిద్ధార్థ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌. శశికాంత్‌ తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఇందులో కుముద అనే పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘కుముద…నా జీవితంలోకి ఓ పాత్రలా వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ పాత్రను ఇంత అందంగా తీర్చిదిద్దిన దర్శకుడు శశి, కుముదకు అండగా నిలిచిన మాధవన్‌, స్ఫూర్తినిచ్చిన సిద్ధార్థ్‌… అందరికీ చాలా థాంక్యూ. ‘టెస్ట్‌’ ద్వారా మా ప్రేమను చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’ అని పేర్కొన్నారు. దీనితో పాటు మరో తమిళ సినిమాలోనూ నటిస్తున్నారు.