Viral News: ఆకాశం నుంచి పడిన మంత్రాల పెట్టె అంటూ మోసం

Viral News: ఆకాశం నుంచి పడిన మంత్రాల పెట్టె రూ. 50 కోట్లు అంటూ మోసం చేస్తున్న కొంద‌రు దుండ‌గుల‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ ఘ‌ట‌న‌ హయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. బంజారాకాలనీలో నివాసముంటున్న నలుగురు వ్య‌క్తులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆకాశం నుంచి ఉల్కలు పడిన సమయంలో శక్తులు ఉన్న పెట్టె దొరికిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.

ఈ పెట్టెను రూ .50 కోట్లకు అమ్ముడుపోయేలా ప్లాన్ చేసుకొని వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేస్తారనే సమాచారం మేరకు హైదరాబాద్ నుంచి వరంగల్ బయలుదేరారు. ఈ క్రమంలో జనగామలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులులకి పెట్టెతో పట్టుబడ్డారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.