Rakul Preet Singh: భర్తతో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన రకుల్!

Rakul Preet Singh: బాలీవుడ్ లవ్ బర్డ్స్ రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ (Jacky Bhagnani) ఇటీవలే మూడు ముళ్లతో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఇక ఈ పెళ్లి అయిన దగ్గర నుంచి మ్యారేజ్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సందడి చేస్తున్నారు రకుల్.. తాజాగా ఓ వీడియో షేర్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

పెళ్లి తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ మొదటి సారి తన భర్తతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను నెట్టింట అభిమానులతో పంచుకుంది.. అయితే ఈ డాన్స్ రీల్ ఒక ఛాలెంజ్ లో భాగంగా చేశారు. బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా ఛోటే మియా’. ఈ మూవీ నుంచి ఇటీవల ‘మస్త్ మలంగ్ ఝుమ్’ అనే పాటని రిలీజ్ చేశారు.. అయితే ఈ పాటను టైగర్ షాఫ్ర్ రీ క్రియేట్ చేశారు.

అంతేకాదు.. ఆ వీడియోను రీ క్రియేట్ ఛాలెంజ్ ను విసిరారు. బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, రకుల్, జాకీ భగ్నానీ అండ్ తన ఫ్యాన్స్ కి ఛాలెంజ్ ఇచ్చారు. ఆ పాటలోని స్టెప్పులను రీ క్రియేట్ చేస్తూ రీల్ చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇక టైగర్ ఇచ్చిన ఛాలెంజ్ ని అంగీకరిస్తూ.. రకుల్ అండ్ జాకీ కలిసి ఆ డాన్స్ వీడియో చేశారు.. కొత్త జంట స్టెప్పులకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.. చాలా బాగా చేశారని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దాంతో ఈ వీడియో ట్రెండ్ అవుతుంది.

ALSO READ: తెలుగు హీరోయిన్ ఐస్‌బాత్.. ఫోటోలు వైరల్..!

ఇది ఇలా ఉంటే, ఈ సాంగ్ లో అక్షయ్ అండ్ టైగర్ వేసిన స్టెప్పులు.. ‘నాటు నాటు’ పాటకి రామ్ చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు మాదిరి ఉన్నాయంటూ కొందరు నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. నాటు నాటు స్టెప్ నే కొద్దిగా అటుఇటుగా మార్చి ‘బాస్కో-సీసర్’ ఈ పాటకి కోరియోగ్రఫీ చేసేసారు. అయితే ఈ పాటలోని స్టెప్స్ మాత్రమే కాపీ కాదు, సాంగ్ ట్యూన్ కూడా కాపీనే అంటున్నారు నెటిజెన్స్. విశాల్ మిశ్ర కంపోజ్ చేసిన ఈ పాట వింటుంటే.. తమన్నా ‘కావాలి’ సాంగ్ గుర్తుకు వస్తుంది.

ఇక, 2021 అక్టోబర్‌లో బర్త్‌డే సందర్బంగా రకుల్‌ తన సోల్‌మేట్‌ను వెతుక్కున్నానంటూ జాకీ భగ్నానీని పరిచయం చేసింది. అప్పుడే తన ప్రేమను ఆఫీషియల్‌ కూడా చేసింది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన వీరిద్దరు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఇక ఆ త‌ర్వాత ఈ నెల 21న ఇద్ద‌రు పెళ్లితో ఒక్కట‌య్యారు. గోవాలో జరిగిన వీరి గ్రాండ్‌ వెడ్డింగ్‌కి కొద్దిమంది స‌న్నిహితులు, కుటుంబ‌ సభ్యులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ఇక ఈ పెళ్లిలో చ‌క్క‌టి పింక్ లెహంగాలో మెరిసిపోయారు ర‌కుల్ ప్రీత్ సింగ్. సిల్వ‌ర్ షేర్వాణీలో అందంగా క‌నిపించారు జాకీ భ‌గ్నానీ.

దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్టులో రుకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ వెడ్డింగ్‌కు బాలీవుడ్‌ స్టార్స్‌ అంతా గోవా వెళ్లిన సంగతి తెలిసిందే. అన‌న్య పాండే, భూమి పెడ్నేక‌ర్, ఆదిత్య రావ్ క‌పూర్, వ‌రుణ్ ధావ‌న్, శిల్పాశెట్టి, రాజ్ కుంద్ర‌, ఆయుష్మాన్ ఖురానా, షాహిద్ క‌పూర్, మిరా రాజ్ పుత్ త‌దిత‌రులు వివాహానికి హాజ‌ర‌య్యారు.

https://www.instagram.com/reel/C4FMGCRKWyX/?utm_source=ig_web_copy_link