Chalo Medigadda: వ‌ర్షాకాలంలో బ్రిడ్జ్ కొట్టుకుపోవాల‌ని చూస్తున్నారు

Chalo Medigadda: మేడిగ‌డ్డ అంత కుంగింది ఇంత కుంగింది అని ఉదయం లేచిన ద‌గ్గ‌ర నుంచి ఒక‌టే పాట పాడుతున్న కాంగ్రెస్ నేత‌లు మ‌రి ఆ బ్రిడ్జ్‌ను రిపేర్ చేయించ‌డానికి ఏంటి ఇబ్బంది అని ప్ర‌శ్నించారు భార‌త రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ KTR. ఈరోజు చ‌లో మేడిగ‌డ్డ కార్య‌క్ర‌మంలో భాగంగా KTR.. ఇత‌ర BRS నేత‌లు బ‌స్సులో మేడిగ‌డ్డ సంద‌ర్శ‌న‌కు బ‌య‌లుదేరారు. ఈ సంద‌ర్భంగా KTR మాట్లాడుతూ..

“””బాధ్యత మరచి ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది. వాస్తవాలు చెప్పడానికే మా ఈ చలో మెడిగడ్డ పర్యటన. రైతు ప్రయోజనం ముఖ్యం కాదు రాజకీయ ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి కావాలి. ఇవ్వాళ‌ చేస్తున్న‌ది మొదటి పర్యటన మాత్రమే. తర్వాత అన్ని ప్రాజెక్టుల్లో పర్యటిస్తాం. రిపేర్ చేయడానికి ఇబ్బంది ఏంటి? బాధ్యుల‌పై చర్యలు తీసుకోండి. రైతులను బలి చేయొద్దు. రిపేర్ చేయకుండా ఉంటే వర్షకాలంలో వ‌ర‌ద‌లు వస్తే బరేజ్ కొట్టుకుపోవాల‌ని చూస్తున్నారు “”” అన్నారు. (Chalo Medigadda)

అప్పుడు మేమేమ‌న్నా అన్నామా?

“””” ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. 5 వందలు 6 వందలు మీటర్ల లోతునుంచి నీళ్లను లిఫ్ట్ చేసే గొప్ప కార్యక్రమం. బీమా, నేటంపాడు ప్రాజెక్టులు పూర్తి చేసి వలసలు ఆపేసినం. 86 పిల్ల‌ర్ల‌లో 3 పిల్ల‌ర్లు కుంగినై. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులో కూడా సంకేతిక లోపాలు ఉంటాయి. అవి సరిదిద్దుకోవాలి. కాళేశ్వరంలో మొత్తం196 స్కీం ఉన్నాయి. మూడు పిల్ల‌ర్లు కుంగితే భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు అసంపూర్తిగా ఉన్న మేం ఎన్నడు బ్లేమ్ చేయలేదు.

కడియం ప్రాజెక్టు రెండు మార్లు తెగింది, అలా అని ఇప్పుడు మెడిగడ్డ కేవలం కుంగింది కానీ తెగలేదు. రాజకీయాల కోసం రాజకీయ పబ్బం గడపడానికి రైతులను ఫణంగా పెట్టకండి. రైతు ప్రయోజనాలకు అడ్డు పడొద్దని డిమాండ్ చేస్తున్నాం. వచ్చే వర్ష కాలం కల్లా సుందిళ్ళ ,అన్నారం, ఎల్లంపల్లి, కొండపోచమ్మ, మల్లన్న సాగర్లో నీటిని నింపండి. రైతులను ఇబ్బంది పెడితే నష్టం మీకే. గతంలో 40 ఏండ్లు అయిన ఒక్కో దగ్గర ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కానీ మన కాళేశ్వరం మూడు ఏండ్లలో పూర్తి చేసినం. ఇక‌ రైతు బంధు గతి లేదు. ఇప్పటికి మూడు సార్లు పెండింగ్‌లో పెట్టారు “””” అని మాజీ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.