YS Sharmila: ఓ చెల్లిగా అర్థం చేసుకున్నా.. పొత్తుకు సై ..!

YS Sharmila: రానున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో (AP Elections) ఏపీ కాంగ్రెస్ వామ‌ప‌క్ష పార్టీలైన CPM, CPIల‌తో పొత్తులు పెట్టుకునేందుకు సిద్ధప‌డింది. ఈ నేప‌థ్యంలో ఆంధ్రరత్న భవన్ లో APCC చీఫ్ వైఎస్ ష‌ర్మిళ‌తో CPM, CPI నేతలు సమావేశమ‌య్యారు. CPM నుంచి M.A గఫూర్, వెంకటేశ్వర్ రావు, శ్రీనివాస్ రావు హాజరు కాగా.. CPI నుంచి రామకృష్ణ,నాగేశ్వర రావు,ఆకినేని వనజ, జల్లి విల్సన్ హాజరయ్యారు.

YCP,TDPలు BJPకి బానిసలు

ఈ నేప‌థ్యంలో ష‌ర్మిళ మాట్లాడుతూ.. YCP, తెలుగు దేశం పార్టీలు భార‌తీయ జ‌న‌తా పార్టీకి బానిస‌లుగా బ‌తుకుతున్నాయ‌ని ఆరోపించారు. భార‌తీయ జ‌న‌తా పార్టీకి తొత్తులుగా మారి ఆంధ్ర రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారని ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ఈ ప్రయాణంలో బాగంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటున్నామ‌ని ప్ర‌క‌టించారు.

కలిసి పోరాడే అంశంపై చర్చలు చేశాం. మేమంతా కలిసికట్టుగా పోరాటాలు చేస్తాం. కలిసి కట్టుగా లేక పోతే ఈ పెద్ద పర్వతాలను దించడం అసాధ్యం. అనంతపురం సభకు CPI,CPM లను ఆహ్వానించా. ఎన్నికల్లో సీట్లపై చర్చలు జరుగుతున్నాయి. పొత్తులపై త్వరలో అన్ని అంశాల మీద క్లారిటీ వస్తుంది. కాంగ్రెస్ 2014 అధికారంలో వచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా వచ్చేది. హోదా విషయంలో జగన్,బాబు ఇద్దరు విఫలం అయ్యారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఉంటే పోలవరం పూర్తి అయ్యేది. న‌రేంద్ర మోదీ తిరుపతిలో మాట ఇచ్చి హోదా పై మాట మార్చారు. రామభక్తులు అని చెప్పుకుంటే సరిపోతుందా ? అని కేంద్రంపై మండిప‌డ్డారు. (YS Sharmila)

ఆళ్ళ రామకృష్ణ రెడ్డిపై ఒత్తిడి ఉంది

ఆళ్ళ రామకృష్ణ రెడ్డి నాకు దగ్గర మనిషి. ఆయన ఎక్కడున్నా బాగుండాలి..సమానంగా ఉండాలి..సంతోషంగా ఉండాలి. ఆయన మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడులు ఉన్నాయి. ఆయన చెల్లెలిగా నేను అర్థం చేసుకున్నాను. ఒక మంచి పర్సన్ ఒక రాంగ్ ప్లేస్‌లో ఉన్నారు అని తెలిపారు.

CPM శ్రీనివాస రావు మాట్లాడుతూ..

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ, YCP, TDP మీదనే మా పోరాటం. ఈ కూటములు రాష్ట్రాన్ని ఘోరంగా మోసం చేశాయి. రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓటు షేర్ లేని భార‌తీయ జ‌న‌తా పార్టీ శాసిస్తుంది. బీజేపీ మీద దుమ్మెత్తి పోసిన బాబు ఇప్పుడు పొర్లు దండాలు పెడుతున్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ ముఖ్యమంత్రులు కూడా ఇన్ని సార్లు డిల్లీ చుట్టూ తిరగడం లేదు. ఇన్ని సార్లు తిరిగిన ఒక్క హామీ కూడా అమలు కాలేదు. రాజధానికి నిధులు లేవు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తో సహకారం తీసుకుంటాం. అందరం కలిసి కట్టుగా ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఈ దుష్ట‌ కూటమిలను ఓడగొడతాం. భార‌తీయ జ‌న‌తా పార్టీనీ, వారికి కాపు గాసే వారిని సాగనంపుతాం అని అన్నారు.

CPI రామకృష్ణ మాట్లాడుతూ..

BJPది మత తత్వ రాజకీయం. భార‌తీయ జ‌న‌తా పార్టీ మళ్ళీ అధికారంలో వస్తె అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మారుస్తారు. దేశం అత్యంత ప్రమాదంలో ఉంది. ప్రధాన మైన ప్రాంతీయ పార్టీలు భార‌తీయ జ‌న‌తా పార్టీకి భయపడుతున్నారు. జగన్,బాబు,పవన్ మోడీకి దాసోహం అంటున్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం భార‌తీయ జ‌న‌తా పార్టీ దగ్గర తాకట్టు పెట్టారు. ఇతర ప్రజా తంత్ర పార్టీలను కూడా కూడ గడతం. దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ మళ్ళీ అధికారం రాకూడదు. జగన్ 5 ఏళ్లు పాలనలో రాష్ట్రం సర్వనాశనం. ప్రజలను బిచ్చగాళ్లను చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఈ ప్ర‌భుత్వానికి సిగ్గుపడాలి. ఒక PCC అధ్య‌క్ష‌రాలైన ష‌ర్మిళ‌ను అరెస్ట్ చేయడం దారుణం అని మండిప‌డ్డారు.