Genelia: జెనీలియా నిర్మాతగా.. భ‌ర్త‌తో మ‌రో సినిమా

Genelia: వరుస సినిమాలతో బిజీగా ఉన్న రితేశ్‌ దేశ్‌ముఖ్‌ (Ritesh Deshmukh) తొలిసారి చారిత్రక పాత్రలో మెరనున్నారు. ఛత్రపతి శివాజీ పాత్రలో ఆయన నటిస్తుండడంతో పాటు ఆ సినిమాకు దర్శకత్వం వహించనుండడం విశేషం.

బాలీవుడ్ క‌ల్చ‌ర్ లో ఉన్నా జెనిలియా (Genelia D’souza) ఎంతో హుందాగా న‌డుచుకుంటుంది. భ‌ర్త కోరిక‌లనే త‌న కోరిక‌లుగా మ‌లుచుకుని జీవితంలో మ‌రింత సంతోషంగా క‌నిపిస్తుంది. రితేష్ దేశేముఖ్ శివాజీ మ‌హ‌రాజ్ క‌థ‌ని చాలా కాలంగా తెర‌కెక్కించాల‌నుకుంటున్నారు. ఆ ర‌క‌మైన ప్ర‌య‌త్నాలు చాలాసార్లు చేసారు. కానీ ఏదో ఆట‌కంతో ఆగిపోయేది. కానీ ఈసారి మాత్రం ఆ ఛాన్సే లేకుండా ఈ చిత్రాన్ని ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి జెనిలియా ముందుకొచ్చింది.

మరాఠా సామ్రాజ్యాధిపతి ఛత్రపతి శివాజీ (Chatrapathi Shivaji) జీవిత చరిత్రపై మరో సినిమా రాబోతున్నది. గతంలో శివాజీ జీవితంలోని కొన్ని ఘట్టాలకు సినిమాలు రాగా.. ఇప్పుడు బాలీవుడ్‌ ప్రముఖ హీరో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ శివాజీ నేపథ్యంలో సినిమా తీయనున్నాడు. పెద్ద తెరపై శివాజీ జీవితాన్ని మరోసారి చూడనున్నాం. శివాజీ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాకు దర్శకత్వంతోపాటు శివాజీ పాత్రలో రితేశ్‌ నటించనున్నాడు. సినిమా పేరును కూడా ప్రకటించారు. ‘రాజా శివాజీ’ పేరిట సినిమాను తెరకెక్కించనున్నాడు.

ADD MORE: Ritesh Deshmukh: జెనీలియా ప్రెగ్నెన్సీపై రితేష్ రియాక్ష‌న్

సొంత భాష మరాఠీతో పాటు హిందీలో ద్విభాష చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. వచ్చే ఏడాది విడుదల చేయాలని సినిమా బృందం భావిస్తోంది. రితేశ్‌ ప్రస్తుతం ‘వేద్‌’ సినిమా విజయోత్సాహంతో ఉన్నాడు. ఈ చారిత్రక సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా చారిత్రక శివాజీ పాత్రలో రితేశ్‌ మెరవనుండడం విశేషం. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అనేది ఒక పేరు కాదు ఒక భావోద్వేగం. శివాజీ జయంతిని పురస్కరించుకుని ఈ నేల కన్న గొప్ప నాయకుడికి నేను నివాళులర్పిస్తున్నా. అతడి జీవిత ప్రస్థానం తరతరాలుగా స్ఫూర్తి రగిలిస్తోంది. శివాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. జై శివ్‌రాయ్‌‘ అని రితేశ్‌ దేశ్‌ముఖ్‌ ట్వీట్‌ చేశాడు. ఈ సందర్భంగా చిన్న వీడియోను పంచుకున్నాడు.

జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్‌ సంతోశ్‌ శివన్‌ ఈ సినిమాతో మరాఠీ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. అజయ్‌ తుల్‌ సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇక తన భర్త నటిస్తున్న ఈ సినిమాకు జెనీలియా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జియో స్టూడియోస్‌ సమర్పణలో ముంబై ఫిల్మ్‌ అకాడమీ బ్యానర్‌లో ‘రాజా శివాజీ’ సినిమా తెరకెక్కుతోంది. జ్యోతి దేశ్‌పాండే కూడా మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

బాలీవుడ్ ఆద‌ర్శ దంప‌తులుగా వెలిగిపోతున్న‌ రితీష్ దేశ్ ముఖ్-జెనిలియా జోడీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రు పిల్ల‌ల‌తో ఈ జోడీ నెట్టింట ఎప్పుడూ హల్చ‌ల్ చేస్తుంటుంది. చూడ‌ముచ్చ‌టైన కుటుంబాన్ని చూస్తూ అభిమానులు ఎంతో మురిసిపోతుంటారు. ఇద్ద‌రు ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంత సంతోషంగా ఉన్నార‌ని అంతా సంబ‌ర ప‌డిపోతుంటారు. వివాహం త‌ర్వాత జెనిలియా కూడా అంతే సెల‌క్టివ్ గా ఉంటుంది. ఇక రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా 2012 లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవల ఈ దంపతులు ‘వేద్’ అనే సినిమాలో జంటగా నటించారు. ఇది తెలుగులో సూపర్ హిట్ అయిన ‘మజిలీ’ కి రీమేక్.