Devara: ఈసారి క‌లిసొస్తుందా?

Devara: ఎన్టీఆర్ (JR NTR) దేవర కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించారు. ఏప్రిల్ 5న దేవర రావడం లేదనే రూమర్లు గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఆ డేట్‌కు విజయ్ (Vijay Devarakonda) ఫ్యామిలీ స్టార్ (Family Star) రానుందని ప్రకటించారు. దీంతో దేవర పోస్ట్ పోన్ అన్న సంగతి అందరికీ అర్థమైంది. తాజాగా దేవర కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, కొరటాల శివ (Koratala Siva) కాంబోలో వ‌స్తున్న తాజా చిత్రం ‘దేవర’. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) విల‌న్‌గా న‌టిస్తున్నాడు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ కావ‌డంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమా గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. అయితే సైఫ్ అలీ ఖాన్ గాయపడటంతో షూటింగ్ కొన్ని రోజులుగా జరగడం లేదన్న సంగతి తెలిసిందే. దీంతో ముందుగా అనుకున్న తేదీకి అంటే ఏప్రిల్ 5న సినిమా వచ్చేందుకు అవకాశం లేదని అందరికీ అర్థమైంది.

అందుకే ఏప్రిల్ 5న దిల్ రాజు (Dil Raju) తన ఫ్యామిలీ స్టార్‌ను దించేందుకు రెడీ అయ్యాడు. ఇక ఆ ప్రకటనతో దేవర పోస్ట్ పోన్ అయిందన్న వార్త కన్ఫామ్ అయిపోయింది. తాజాగా దేవరకు సంబంధించిన కొత్త విడుదల తేదీని ప్రకటించారు. దసరాకు దేవర వేట ఉండబోతోందని ప్రకటించేశారు. అక్టోబర్ 10న దేవర రిలీజ్ కాబోతోందని మేకర్లు తాజాగా అనౌన్స్ చేశారు. అయితే ఈ దసరాకు భారీ పోటీ ఉండేలా కనిపిస్తోంది.

న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ కోసం డిజైన్ చేసిన ఈ కొత్త పోస్టర్ ఇప్పుడు అదిరిపోయిందని అభిమానులు సంబరపడుతున్నారు. సినిమా చాలా ఆలస్యం కానుందని, మరీ ఇంత వెనక్కి వెళ్లిపోయిందేంటి? అని కొంత మంది అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. కానీ ఎంత లేట్ అయినా పర్లేదు అవుట్ పుట్ మాత్రం అదిరిపోవాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. (Devara)

ఇక ఈ చిత్రం ఓటీటీ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా ఓటీటీ హక్కులని నెట్ ఫ్లిక్స్ ఏకంగా 155 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నట్టుగా ఓ టాక్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సినిమాలో ఇప్పటికే కీలక పాత్రలో రమ్యకృష్ణని తీసుకోబోతున్నారట దర్శక నిర్మాతలు. ఎన్టీఆర్‌కి అత్త క్యారెక్టర్‌లో రమ్యకృష్ణ కనిపించనున్నారని తెలుస్తోంది. గతంలో కూడా ఇలానే ఎన్టీఆర్, రమ్యకృష్ణలు నా అల్లుడు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్‌గా ఈ సినిమాలో ఎన్టీఆర్ అక్క పాత్ర కోసం మంచు లక్ష్మిని ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుందట. దీనికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ దసరా సీజన్‌లో పవన్ కళ్యాణ్ ఓజీ, రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా వచ్చేలా ఉన్నాయి. ఆల్రెడీ ఓజీ రిలీజ్ డేట్‌ను ప్రకటించేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27 ఓజీ రాబోతోంది. అంటే ఓ వారం గ్యాప్‌లో దేవర దిగుతోందన్న మాట. ఇక గేమ్ చేంజర్ మీద ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ మళ్లీ రాలేదు. ఆ మధ్య దిల్ రాజు మాట్లాడుతూ సెప్టెంబర్‌లో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపాడు.