Narendra Modi: త‌ర్వాతి స్థానం ఎవ‌రిది?

Narendra Modi: భార‌త ప్ర‌ధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తర్వాత.. BJPలో ప్రధాని అయ్యే అవకాశం, అర్హత ఎవరికి ఉంది? అన్న ప్రశ్నపై మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే జరిగింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

దేశ, విదేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న పేరు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడంలో ఆయన చేసిన పాత్ర ఎనలేనిది. అందుకే మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో మోదీకి ఉన్న ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఇక బీజేపీలో అయితే ప్రస్తుతం ఆయనే నంబర్ 1.

నరేంద్ర మోదీ తర్వాత BJPలో ఎవరు అనే దానిపై తాజాగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కీలక విషయాలు వెల్లడించింది. మోదీని చూసి BJPకి ఓటు వేసేవారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. 2014 తో పాటు 2019 సార్వత్రిక ఎన్నికలు, ఈ 10 ఏళ్ల కాలంలో దేశంలో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మ చూసి బీజేపీకి ఓటు వేసిన ఓటర్లు చాలా మందే ఉన్నారు. అందుకే ఏ ఎన్నికల ర్యాలీ, ప్రచారం, బహిరంగ సభల్లో మోదీ.. మోదీ.. అనే నినాదాలు వినిపిస్తూ ఉంటాయి.

ఇక తాజాగా మూడ్ ఆఫ్ ది నేషన్ సంస్థ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకుంటుందని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొడతారని వెల్లడించింది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలతో పాటు దేశ ప్రజల్లోనూ ఒక ప్రశ్న నెలకొంది. మోదీ తర్వాత బీజేపీలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరు అనే దానిపై ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే దానిపై కూడా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నిర్వహించింది. ఇందులో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీలో చాణుక్యుడిగా పిలుచుకునే అమిత్ షా.. నరేంద్ర మోదీ తర్వాత బీజేపీలో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మూడో స్థానంలో ఉన్నారు. ఇక ఆ తర్వాతి స్థానంలో కేంద్ర రవాణాశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ నిలిచారు.

అయితే దేశంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో (Lok Sabha Elections) మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నిర్వహించింది. గత ఏడాది డిసెంబర్ 15 వ తేదీ నుంచి ఈ అయితే దేశంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నిర్వహించింది. గత ఏడాది డిసెంబర్ 15 వ తేదీ నుంచి ఈ ఏడాది జనవరి 28 వ తేదీ వరకు నిర్వహించిన ఈ సర్వేను 2024 ఫిబ్రవరి పేరుతో విడుదల చేసింది. మొత్తం 35,801 మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సర్వే ఫలితాలను వెలువరించింది.

మోదీ తర్వాత ఎవరు ప్రధాని అవ్వాలని కోరుకుంటున్నారు? అన్న ప్రశ్న.. తన సర్వేలో పెట్టింది మూడ్​ ఆఫ్​ ది నేషన్​. కేంద్ర మంత్రులు అమిత్​ షా, నితిన్​ గడ్కరీ, ఉత్తర్​ ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ పేర్లను ఆప్షన్​లుగా ఇచ్చింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత 29 శాతంతో అమిత్ షా రెండో స్థానంలో.. 25 శాతంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మూడో స్థానంలో.. ఆ తర్వాత 16 శాతంతో నితిన్ గడ్కరీ నాలుగో స్థానంలో నిలిచారు.